Share News

Nita Ambani Viral Video: చాట్ తింటూ కాశీలో సందడి చేసిన నీతా అంబానీ.. ఆకస్మిక పరిణామంతో స్థానికులు షాక్

ABN , Publish Date - Jun 25 , 2024 | 11:03 AM

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ(Nita Ambani ) ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కాశీ విశ్వేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ ఆహ్వాన పత్రాన్ని శివాలయంలో అందజేశారు.

Nita Ambani Viral Video: చాట్ తింటూ కాశీలో సందడి చేసిన నీతా అంబానీ.. ఆకస్మిక పరిణామంతో స్థానికులు షాక్

ఢిల్లీ: రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ(Nita Ambani) ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కాశీ విశ్వేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ ఆహ్వాన పత్రాన్ని శివాలయంలో అందజేశారు. దైవదర్శనం తరువాత ఆమె స్థానికులతో ముచ్చటించారు.

ఓ చాట్ దుకాణం దగ్గర ఆగి అక్కడ చాట్ ఆర్డర్ చేశారు. దుకాణదారులతో ముచ్చటిస్తూ చాట్ ఆస్వాదించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. "యే పాలక్ చాట్ హై" అని దుకాణదారుల్లో ఒకరు ఆమెతో అనడం వీడియోలో కనిపిస్తోంది. గులాబీ రంగు బనారసీ చీరలో నీతా అంబానీ అందంగా కనిపించారు. ఆమె వజ్రాల నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానికులు ఆమెను షాక్‌కి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె సింప్లిసిటీని నెటిజన్లు మెచ్చుకున్నారు.


కుమారుడి పెళ్లి హడావుడి ఉన్నప్పటికీ నీతా అంబానీ ఇలా అందరితో పలకరించడం, మాట్లాడటం నచ్చిందని ఓ వినియోగదారుడు కామెంట్ చేయగా.. ఆమెను చూస్తుంటే మా అమ్మమ్మ గుర్తొస్తుందంటూ మరో యూజర్ అన్నాడు. బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ వివాహం జులై 12న BKCలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరగనుంది.

ఈ జంట ఇటీవల యూరప్‌లో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ను ఘనంగా జరుపుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్ నుంచి హీరోయిన్ కియారా అద్వానీ వరకు చాలా మంది సెలెబ్రిటీలు ఈ వేడుకలకు హాజరయ్యారు.

For Latest News and National News click here

Updated Date - Jun 25 , 2024 | 11:03 AM