Share News

Train accident: రైలు ప్రమాదస్థలికి బైక్‌పై కేంద్ర మంత్రి.. రాజకీయాలకు సమయం కాదని స్పష్టీకరణ

ABN , Publish Date - Jun 17 , 2024 | 05:48 PM

పశ్చిమబెంగాల్‌ లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ నుంచి బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి బైక్‌పై ఘటనా స్థలికి చేరుకున్నారు.

Train accident: రైలు ప్రమాదస్థలికి బైక్‌పై కేంద్ర మంత్రి.. రాజకీయాలకు సమయం కాదని స్పష్టీకరణ

డార్జిలింగ్: పశ్చిమబెంగాల్‌ (West Bengal)లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Aswini Vaishnaw) ఢిల్లీ నుంచి బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి బైక్‌పై ఘటనా స్థలికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించిన వెంటనే నేరుగా క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.

Kanchanjungha Express collision: పలు రైల్వే సర్వీసులు రద్దు.. మరికోన్ని దారి మళ్లింపు


సహాయక చర్యలు పూర్తి, దర్యాప్తునకు ఆదేశం

రైలు ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని ఈ సందర్భంగా మీడియా మాట్లాడుతూ అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ''రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. రెస్టొరేషన్ పనిపై దృష్టి సారించాం'' అని తెలిపారు. ప్రమాద ఘటనపై విపక్షాల విమర్శలపై అడిగినప్పుడు..ఇది రాజకీయాలకు సమయం కాదని సున్నితంగా వారించారు. కాగా, రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారిలో గూడ్స్ రైలు లోకోపైలట్, ఎక్స్‌ప్రెస్ రైలు గార్డ్‌తో సహా ముగ్గురు రైల్వే ఉద్యోగులు కూడా ఉన్నారని అధికారులు ధ్రువీకరించారు.

Also Read: Read Latest National News and Telugu States News

Updated Date - Jun 17 , 2024 | 05:48 PM