Share News

చంద్రబాబుతో వీఐటీ అధినేతల భేటీ

ABN , Publish Date - Jun 23 , 2024 | 03:28 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో ప్రపంచ ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఒకటైన వేలూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఐటీ) వ్యవస్థాపకులు....

చంద్రబాబుతో వీఐటీ అధినేతల భేటీ

చెన్నై, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో ప్రపంచ ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఒకటైన వేలూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఐటీ) వ్యవస్థాపకులు, చాన్సలర్‌ డాక్టర్‌ జి.విశ్వనాథన్‌, ఉపాధ్యక్షులు డాక్టర్‌ జీవీ సెల్వం భేటీ అయ్యారు. ఏపీ సచివాలయంలో చంద్రబాబును కలుసుకుని నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆధునిక అమరావతి నగర సృష్టికర్త అయిన చంద్రబాబుపాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

Updated Date - Jun 23 , 2024 | 03:30 AM