Share News

Viral: పెళ్లిల్లందు ఈ పెళ్లి వేరయా.. ఆ చిన్న కారణంతో ఐదు గంటల్లోనే విడాకులు..

ABN , Publish Date - Jan 29 , 2024 | 02:15 PM

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఆ జంట తాము ప్రారంభించబోయే కొత్త జీవితం గురించి కలలు కంటూ మురిసిపోయారు. ఇద్దరం వేర్వేరు కాదని...

Viral: పెళ్లిల్లందు ఈ పెళ్లి వేరయా.. ఆ చిన్న కారణంతో ఐదు గంటల్లోనే విడాకులు..

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఆ జంట తాము ప్రారంభించబోయే కొత్త జీవితం గురించి కలలు కంటూ మురిసిపోయారు. ఇద్దరం వేర్వేరు కాదని ఇక నుంచి ఒకటేనని ఎంతో పొంగిపోయారు. కానీ వాళ్ల ఆనందం అంతలోనే ఆవిరైంది. పెళ్లిలో తలెత్తిన చిన్న గొడవ మాటా మాటా పెరిగి గాలివానలా మారింది. కట్ చేస్తే.. ఐదు గంటల్లోనే ఆ పెళ్లికి శుభం కార్డు పడింది. ఔరంగాబాద్ లో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ ప్రాంతానికి చెందిన పెళ్లి బృందం ఔరంగాబాద్‌కు వచ్చింది. రాత్రి 8 గంటలకు అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. గొడవ చెలరేగడంతో రాత్రి ఒంటి గంటకు విడాకులు తీసుకున్నారు.

ఔరంగాబాద్‌ కు చెందిన యువతికి దిల్లీలోని సీమాపురిలో నివాసముంటున్న యువకుడితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి వేడుకల్లో భాగంగా వరుడు భారీ ఊరేగింపుతో ఔరంగాబాద్‌కు వచ్చాడు. ఇక్కడ వధువు తరఫు వారు పెళ్లి ఊరేగింపుకు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో రాత్రి 10:30 గంటలకు వరుడి అమ్మమ్మ కుర్చీలో కూర్చుని ఉంది. ఇంతలో ఆడ పెళ్లివారి తరఫు బంధువు ఒకరు ఆమెను కుర్చీలోంచి లేపారు. విషయం తెలుసుకున్న పెళ్లికొడుకు ఆగ్రహంతో ఊగిపోయాడు. తీవ్ర దూషణలతో గొడవ కాస్తా ఘర్షణగా మారింది. ఘటనతో అవాక్కైన వధువు ఈ పెళ్లి వద్దని తేల్చి చెప్పేసింది.


సమాచారం అందుకున్న మాజీ చైర్మన్ అక్తర్ మేవతి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు. రాత్రి ఎనిమిది గంటలకు వివాహం జరగగా అదే రాత్రి ఒంటి గంటకు విడాకులు తీసుకోవడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ ఘటనపై తమకు సమాచారం లేదని, ఫిర్యాదు అందితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

"మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Jan 29 , 2024 | 02:15 PM