Share News

Asaduddin Owaisi: బెదిరింపులకు భయపడేది లేదు..

ABN , Publish Date - Jul 20 , 2024 | 05:27 AM

తనను హతమార్చుతామంటూ బెదిరింపు ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు వస్తున్నాయని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు.

Asaduddin Owaisi: బెదిరింపులకు భయపడేది లేదు..

  • మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ

హైదరాబాద్‌, జూలై 19(ఆంధ్రజ్యోతి): తనను హతమార్చుతామంటూ బెదిరింపు ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు వస్తున్నాయని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై ద్వేషం పెంచుకుందని విమర్శించారు.


గతంలో ఉత్తరప్రదేశ్‌లో తనపై కాల్పులు జరిపిన దుండగులను ఇప్పటికీ అరెస్ట్‌ చేయలేదని పేర్కొన్నారు ఒక పార్లమెంట్‌ సభ్యునిపైనే దాడులు జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అస్సాంలో ముస్లింల జనాభా 40శాతం దాటిందంటూ ముఖ్యమంత్రి హిమంత బిశర్మ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అక్కడ 34 శాతం మాత్రమే ముస్లింల జనాభా ఉందని చెప్పారు.

Updated Date - Jul 20 , 2024 | 05:27 AM