Share News

Bandi Sanjay: పాత బస్తీ ఏమైనా ఒవైసీ జాగీరా?

ABN , Publish Date - Jul 30 , 2024 | 04:07 AM

‘‘పాతబస్తీ ఏమైనా ఒవైసీ జాగీరా?’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌పై మండిపడ్డారు.

Bandi Sanjay: పాత బస్తీ ఏమైనా ఒవైసీ జాగీరా?

  • అక్బరుద్దీన్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఫైర్‌

హైదరాబాద్‌, జులై 29(ఆంధ్రజ్యోతి): ‘‘పాతబస్తీ ఏమైనా ఒవైసీ జాగీరా?’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌పై మండిపడ్డారు. అసెంబ్లీలో అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన దురహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ‘‘రాత్రి 10 గంటలు దాటితే పాతబస్తీలోకి పోలీసులు రావద్దని అక్బరుద్దీన్‌ ఒవైసీ అంటున్నారు.


పాతబస్తీ ఏమైనా ఒవైసీ జాగీరా? లేక పాతబస్తీ ఏమైనా పాకిస్తాన్‌లో ఉందని భావిస్తున్నారా? లేక ఇంకా నిజాం రజాకార్ల పాలనే కొనసాగుతుందని అనుకుంటున్నారా?’’అని నిలదీశారు ఎవరో ఒక పోలీస్‌ తప్పు చేస్తే మొత్తం పోలీస్‌ వ్యవస్థను, పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేలా మాట్లాడటం సిగ్గుచేటని సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు.

Updated Date - Jul 30 , 2024 | 04:07 AM