Share News

Vikarabad: నేవీ రేడార్‌ స్టేషన్‌ శంకుస్థాపన వాయిదా..

ABN , Publish Date - Jul 28 , 2024 | 04:42 AM

వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న నేవీ రేడార్‌ స్టేషన్‌ శంకుస్థాపన వాయిదా పడింది.

Vikarabad: నేవీ రేడార్‌ స్టేషన్‌ శంకుస్థాపన వాయిదా..

వికారాబాద్‌, జూలై 27(ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న నేవీ రేడార్‌ స్టేషన్‌ శంకుస్థాపన వాయిదా పడింది. ఆదివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, సీఎం రేవంత్‌రెడ్డి దీని నిర్మాణానికి శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఆగస్టు 15 తర్వాత శంకుస్థాపన జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.


దామగుండం అటవీ ప్రాంతాన్ని శనివారం నేవీ రేర్‌ అడ్మిరల్‌ రాహుల్‌శర్మ సందర్శించారు. కాగా, రేడార్‌ స్టేషన్‌ కోసం అటవీ ప్రాంతాన్ని భారత నౌకాదళానికి అప్పగించాలనే నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ సామాజిక కార్యకర్త మేధాపాట్కర్‌ రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.

Updated Date - Jul 28 , 2024 | 04:42 AM