Share News

Hyderabad: అధికారంలోకొచ్చి ఆరునెలలైనా చేసిందేమీ లేదు..

ABN , Publish Date - Jun 25 , 2024 | 11:28 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు దాటినా ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం సిగ్గుచేటని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hyderabad: అధికారంలోకొచ్చి ఆరునెలలైనా చేసిందేమీ లేదు..

హైదరాబాద్: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు దాటినా ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం సిగ్గుచేటని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కార్పొరేటర్‌ ముద్దం నర్సింహ్మయాదవ్‌తో కలిసి ఓల్డుబోయినపల్లి డివిజన్‌ పరిధిలోని బోయిన్‌చెరువు, మానస సరోవర్‌ హైట్స్‌ వద్ద ఉన్న నాలా, డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన నాలా పనులను అధికారులు పూర్తి చేయలేదని, డ్రైనేజీ మురుగు నీరు రోడ్లపై పారుతున్నా ఎవ్వరు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఇదికూడా చదవండి: Hyderabad: కోకాపేటలో రూ.498 కోట్లతో జీఐఎస్‌ సబ్‌స్టేషన్‌..


బోయిన్‌ చెరువులో గుర్రపుడెక్క పెరిగి దోమలు విపరీ తంగా పెరిగడంతో రాత్రుళ్లు నిద్ర పోవడం లేదన్నారు. ప్రజల సమస్యలు తీర్చడానికే తనను భారీ మెజారిటీ గెలిపించారని వివరించారు. పెండింగ్‌ పనులను పూర్తి చేయించడం, అభివృద్ధి పనులకు కావలసిన నిధులను రాబట్టేందుకు త్వరలో జిల్లా మంత్రిని కలుస్తానని ఆయన నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, డివిజన్‌ నాయకులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 25 , 2024 | 11:29 AM