Share News

Chandrababu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కళ్లు..

ABN , Publish Date - Jul 07 , 2024 | 01:09 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తన రెండు కళ్లు అని సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్ వైభవం వస్తుందని బాబు ఆశాభావం వ్యక్తం చేశారు...

Chandrababu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కళ్లు..

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తన రెండు కళ్లు అని సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్ వైభవం వస్తుందని బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు విచ్చేశారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆదివారం నాడు ఎన్టీఆర్ భవన్‌లో కార్యకర్తలు, నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో విజయానికి తెలంగాణ పార్టీ శ్రేణులు ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు.ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని ఎన్టీఆర్ భవన్‌కు వచ్చానన్నారు. కార్యకర్తలు, నేతల అభిమానం చూస్తుంటే ఎంతో ఉత్సాహం వస్తుందని చంద్రబాబు తెలిపారు.

Updated Date - Jul 07 , 2024 | 01:12 PM