Share News

CM Revanth Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - May 22 , 2024 | 10:08 AM

తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి స్వామి వారిని దర్శించుకున్నారు.

CM Revanth Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న  సీఎం రేవంత్ రెడ్డి

తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి స్వామి వారిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో శ్రీవారిని రేవంత్ రెడ్డి దర్శించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం మార్గం ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri Venkteswara Swamy) వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తన మనవడి పుట్టెంట్రుకలను స్వామి వారికీ సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.


శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం తిరుపతి వెళ్లారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి కుటుంబ సమేతంగా చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరి వెళ్లారు. మనవడి తలనీలాలు సమర్పించేందుకు రేవంత్ రెడ్డి కుటుంబంతో సహా తిరుపతికి వెళ్లారు. రాత్రికి రచనా అతిథిగృహంలో బస చేశారు.ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫ్యాన్‌ పార్టీకి సీఈసీ చెక్‌..

అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే పిన్నెల్లి..

అమిత్ సా వ్యాఖ్యాలపై కేజ్రీవాల్ ఆగ్రహం..

బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..

జగన్‌ సర్కార్‌ మరో కుట్ర

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 22 , 2024 | 10:08 AM