Share News

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం.. ఉలిక్కిపడ్డ నగరవాసులు

ABN , Publish Date - Jul 12 , 2024 | 07:10 AM

నాంపల్లిలో కాల్పుల కలకలం రేగుతోంది. రైల్వేస్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు.

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం.. ఉలిక్కిపడ్డ నగరవాసులు

హైదరాబాద్‌: భాగ్యనగరంలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. రైల్వేస్టేషన్ దగ్గర ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని పోలీసులు ప్రశ్నించారు. సమాధానం చెప్పని ఆ ముగ్గురు దుండగులు క్షణాల్లోనే పోలీసులపై మెరుపు దాడికి యత్నించి పారిపోవాలని చూశారు.

కాల్పులు ఎందుకు..?

ఒకరు గొడ్డలితో.. మరో ఇద్దరు రాళ్లతో పోలీసులపై దాడికి యత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు కాల్పులు జరిపి దుండగులను పట్టుకున్నారు. ఈ కాల్పులతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది..!. కాగా.. పట్టుబడ్డ వారిలో అనీస్ రాజ్‌తో పాటు మరో ఇద్దరు నిందితులున్నారు. పోలీసుల కాల్పుల్లో ఒకరికి గాయాలవ్వగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురినీ దోపిడీ దొంగల ముఠాగా పోలీస్ డెకాయ్ టీమ్ అనుమానిస్తోంది.


మేమున్నాం..!

ఇదిలా ఉంటే.. ఇటీవలే హైదరాబాద్‌ శివారులో దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇప్పుడు నాంపల్లి స్టేషన్ దగ్గర మరోసారి కాల్పులు జరిగాయి. ఈ వరుస ఘటనలతో హైదరాబాద్ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్న పరిస్థితి. అయితే.. శాంతి భద్రతలు, రక్షణ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని.. నగరవాసులు ప్రశాంతంగా ఉండొచ్చని పోలీసులు అభయమిస్తున్నారు.

Read more Telangana News and Telugu News

Updated Date - Jul 12 , 2024 | 07:43 AM