Share News

Crime News: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన డ్యాన్స్ మాస్టర్‌కు దేహశుద్ధి..

ABN , Publish Date - Jul 15 , 2024 | 05:10 PM

మహిళలు, చిన్నారులపై నిత్యం ఎక్కడో ఒక చోట అత్యాచారాలు, హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కేసులు నమోదు అవుతున్నా, ఎంత మందిని అరెస్టు చేస్తున్నా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. దేశవ్యాప్తంగా ఏదో ఓ మూలన ప్రతి నిత్యం మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని కిరణ్ ఇంటర్నేషల్ స్కూల్లో ఇలాంటి అమానవీయ ఘటనే చోటు చేసుకుంది.

Crime News: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన డ్యాన్స్ మాస్టర్‌కు దేహశుద్ధి..

మేడ్చల్: మహిళలు, చిన్నారులపై నిత్యం ఎక్కడో ఒక చోట అత్యాచారాలు, హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కేసులు నమోదు అవుతున్నా, ఎంత మందిని అరెస్టు చేస్తున్నా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. దేశవ్యాప్తంగా ఏదో ఓ మూలన ప్రతి నిత్యం మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని కిరణ్ ఇంటర్నేషల్ స్కూల్లో ఇలాంటి అమానవీయ ఘటనే చోటు చేసుకుంది. ఒకటో తరగతి విద్యార్థిని పట్ల డ్యాన్స్ మాస్టర్ అసభ్య ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, బంధువులు నిందితుడికి దేహశుద్ధి చేశారు.


అనంతరం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు.. డ్యాన్స్ మాస్టర్, పాఠశాల ప్రిన్సిపల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ ఇలాంటి ఘటనలే సంచలనం సృష్టించాయి. విజయనగరం జిల్లాలో 6నెలల బాలికపై తాత వరసయ్యే వ్యక్తి అత్యాచారం చేశాడు. అలాగే నంద్యాల జిల్లాలో 8ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్లు హత్యాచారం చేసి శవాన్ని రిజర్వాయర్‌లో పడేశారు. ఈ ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. మహిళలు, చిన్నారులు ఎప్పటికప్పుడు మానవ మృగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‍పై మరింత అవగాహన కల్పించాలని పలువురు సూచనలు చేస్తున్నారు.

Updated Date - Jul 15 , 2024 | 05:10 PM