Share News

Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఇంట్రస్టింగ్ సీన్.. సీఎం రేవంత్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

ABN , Publish Date - Jan 23 , 2024 | 08:02 PM

TS Politics: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం నాడు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ ఆయన్ను కలిశారు. దీంతో వీరి భేటి ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఇంట్రస్టింగ్ సీన్.. సీఎం రేవంత్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

హైదరాబాద్, జనవరి 23: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం నాడు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ ఆయన్ను కలిశారు. దీంతో వీరి భేటి ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే జిల్లా నుంచి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు వీరు సీఎంను కలవడం ఆసక్తి రేపుతోంది. కాగా, సీఎంను కలిసిన వారిలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఉన్నారు.

Updated Date - Jan 23 , 2024 | 08:14 PM