Share News

TG: సులువుగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌!

ABN , Publish Date - Jun 10 , 2024 | 03:35 AM

రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం ఆదివారం టీజీపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు సుమారు 74శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంతో పోలిస్తే ఈసారి పరీక్షలో ప్రశ్నలు కొంతమేర సులువుగా ఉన్నాయని అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

TG: సులువుగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌!

  • గతంతో పోలిస్తే నేరుగా జవాబు ఉన్న ప్రశ్నలు అధికం.. రాష్ట్ర ప్రభుత్వ 6 గ్యారెంటీలపై ప్రశ్నలు

  • ప్రశాంతంగా ముగిసిన పరీక్ష.. హాజరైన 3.02 లక్షల మంది అభ్యర్థులు

  • అక్టోబరు 21 నుంచి మెయిన్స్‌.. కరీంనగర్‌ జిల్లాలో మద్యం సేవించి విధులకు హాజరైన ఉద్యోగి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం ఆదివారం టీజీపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు సుమారు 74శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంతో పోలిస్తే ఈసారి పరీక్షలో ప్రశ్నలు కొంతమేర సులువుగా ఉన్నాయని అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నేరుగా సమాధానం ఉండే ప్రశ్నలను ఈసారి ఎక్కువగా అడిగారు. దీంతో మెయిన్స్‌కు ఎంపిక చేసే కటాఫ్‌ మార్కులు పెరగవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గతంలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలను రెండుసార్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షకు సుమారు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా సుమారు 3.02 లక్షల మంది (74 శాతం) హాజరయ్యారు. 31 జిల్లాల్లో మొత్తం 891 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. 150 మార్కులకు ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో నిర్వహించారు.


పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలుచేశారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని త్వరలో వెల్లడించనున్నట్టు అధికారులు చెప్పారు. తర్వాత ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెయిన్స్‌ పరీక్షల కోసం జాబితా ప్రకటించనున్నారు. ఉద్యోగాల సంఖ్య ఆధారంగా 1:50 మంది అభ్యర్థులను మెయిన్స్‌ పరీక్షలకు ఎంపిక చేయనున్నారు. ఈ పరీక్షలను అక్టోబరు 21వ తేదీ నుంచి నిర్వహిస్తారు.


ఆరు గ్యారెంటీలపై ప్రశ్నలు..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలపై ప్రశ్నలు వచ్చాయి. మహాలక్ష్మి పథకం కింద గృహావసరాలకు ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లను సబ్సిడీ ధరలకు అందించడానికి సంబంధించి ఒక ప్రశ్న, గృహ జ్యోతి పథకంపై ఒక ప్రశ్న అడిగారు. ఈసారి ఎక్కువ ప్రశ్నలను సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపై ఇచ్చినట్టు అభ్యర్థులు చెప్పారు. చరిత్రకు సంబంధించిన ప్రశ్నలను తగ్గించారు. గత పరీక్షలో చరిత్రపై 26ప్రశ్నలు ఇవ్వగా, ఈసారి 21 ఇచ్చారు.

  • కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండల కేంద్రంలోని ఓ పరీక్షా కేంద్రంలో ఐడెంటిఫికేషన్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న మీర్జా పర్వేజ్‌భేగ్‌ అనే ఉద్యోగి మద్యం సేవించి విధులకు రావడంతో పోలీసులు ఆయనను స్టేషన్‌కు తరలించారు. తర్వాత తిమ్మాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో అప్పగించారు.

  • ఆసిఫాబాద్‌ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల పరీక్షా కేంద్రంలో ఇద్దరు అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ముందే వచ్చినప్పటికీ పాస్‌పోర్టు సైజు ఫొటోల కోసం బయటికి వెళ్లి ఆలస్యంగా రావడంతో వారిని పరీక్ష కేంద్రంలోనికి అనుమతించలేదు.

  • జగిత్యాలలో 8మంది, కొడిమ్యాల జేఎన్‌టీయూలో ఐదుగురు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 40 మంది, వికారాబాద్‌లో 20 మంది, తాండూరులో 8మంది అభ్యర్థులు ఆలస్యంగా వచ్చి పరీక్ష రాయలేకపోయారు. నల్లగొండ,భువనగిరిలో సుమారు 15 మంది నిమిషం నిబంధనతో వెనుదిరిగారు. అయితే ఇందులో హాల్‌టికెట్‌పై ఫొటో లేకపోవడంతో ముగ్గురు విద్యార్థులను బయటకు పంపారు.


పరీక్ష రాసి వస్తుండగా రోడ్డు ప్రమాదం

  • పంచాయతీ కార్యదర్శి మృతి

వికారాబాద్‌ జిల్లా, యాలాల మండలంలోని అచ్చుతాపూర్‌లో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న సుమిత్ర గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసేందుకు బైక్‌పై వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి వెళ్లి తిరిగి వస్తుండగా ధారూర్‌ మండలంలోని దోర్నాల దగ్గర బైక్‌ అదుపు తప్పి కిందపడటంతో సుమిత్ర తలకు తీవ్ర గాయాలయ్యాయి. భర్త నెహ్రుకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆమెను తాండూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందింది.


అభ్యర్థిని పరీక్ష కేంద్రానికి చేర్చిన కాచిగూడ ఆర్టీసీ డిపో డీఎం

కాచిగూడ ఆర్టీసీ డిపో మేనేజర్‌ రఘు మానవత్వం చాటుకున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షా కేంద్రం చిరునామా తెలియక వేరే చోట దిగిన ఓ యువతిని సకాలంలో పరీక్ష కేంద్రానికి చేర్చి ప్రశంసలు అందుకున్నారు. జీడిమెట్లకు చెందిన నిషిత ప్రిలిమ్స్‌ పరీక్ష రాసేందుకు ఆర్టీసీ బస్సులో వచ్చింది. కోఠిలోని బ్యాంక్‌స్ట్రీట్‌ బస్టా్‌పలో దిగాల్సిన ఆమె అడ్రస్‌ సరిగ్గా తెలియక అబిడ్స్‌ చర్మాస్‌ బస్టాప్‌లో ఉదయం 9.45 గంటలకు దిగింది. ఆమె పరీక్ష రాయాల్సిన సెంటర్‌ సుల్తాన్‌బజార్‌లోని ప్రగతి మహావిద్యాలయం అయితే పరీక్ష సెంటర్‌ దూరంగా ఉండడం అక్కడికి ఎలా చేరుకోవాలో తెలియక ఆందోళనకు గురైంది. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న కాచిగూడ డిపో మేనేజర్‌ రఘు నిషిత పరిస్థితిని గమనించి తన కారులో ప్రగతి మహావిద్యాలయ సెంటర్‌కు 9.55 నిమిషాలకు చేర్చారు. తనను సకాలంలో సెంటర్‌కు చేర్చిన డీఎంకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు.


పరీక్ష రాసి వస్తుండగా రోడ్డు ప్రమాదం

4.jpg

  • పంచాయతీ కార్యదర్శి మృతి

వికారాబాద్‌ జిల్లా, యాలాల మండలంలోని అచ్చుతాపూర్‌లో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న సుమిత్ర గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసేందుకు బైక్‌పై వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి వెళ్లి తిరిగి వస్తుండగా ధారూర్‌ మండలంలోని దోర్నాల దగ్గర బైక్‌ అదుపు తప్పి కిందపడటంతో సుమిత్ర తలకు తీవ్ర గాయాలయ్యాయి. భర్త నెహ్రుకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆమెను తాండూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందింది.


అభ్యర్థిని పరీక్ష కేంద్రానికి చేర్చిన కాచిగూడ ఆర్టీసీ డిపో డీఎం

కాచిగూడ ఆర్టీసీ డిపో మేనేజర్‌ రఘు మానవత్వం చాటుకున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షా కేంద్రం చిరునామా తెలియక వేరే చోట దిగిన ఓ యువతిని సకాలంలో పరీక్ష కేంద్రానికి చేర్చి ప్రశంసలు అందుకున్నారు. జీడిమెట్లకు చెందిన నిషిత ప్రిలిమ్స్‌ పరీక్ష రాసేందుకు ఆర్టీసీ బస్సులో వచ్చింది. కోఠిలోని బ్యాంక్‌స్ట్రీట్‌ బస్టా్‌పలో దిగాల్సిన ఆమె అడ్రస్‌ సరిగ్గా తెలియక అబిడ్స్‌ చర్మాస్‌ బస్టాప్‌లో ఉదయం 9.45 గంటలకు దిగింది. ఆమె పరీక్ష రాయాల్సిన సెంటర్‌ సుల్తాన్‌బజార్‌లోని ప్రగతి మహావిద్యాలయం అయితే పరీక్ష సెంటర్‌ దూరంగా ఉండడం అక్కడికి ఎలా చేరుకోవాలో తెలియక ఆందోళనకు గురైంది. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న కాచిగూడ డిపో మేనేజర్‌ రఘు నిషిత పరిస్థితిని గమనించి తన కారులో ప్రగతి మహావిద్యాలయ సెంటర్‌కు 9.55 నిమిషాలకు చేర్చారు. తనను సకాలంలో సెంటర్‌కు చేర్చిన డీఎంకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు.

Updated Date - Jun 10 , 2024 | 03:35 AM