Share News

Rani Rudrama : ఎస్జీటీలకు పదోన్నతుల్లో న్యాయం చేయండి

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:44 AM

పదోన్నతుల్లో ఎస్జీటీ(సెకండరీ గ్రేడ్‌ టీచర్‌)లకు న్యాయం చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ డిమాండ్‌ చేశారు. వారిని నియమించినప్పుడు ఒక నియమం, పదోన్నతి కల్పించే సమయంలో మరో నియమం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు.

 Rani Rudrama : ఎస్జీటీలకు పదోన్నతుల్లో న్యాయం చేయండి

  • బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ

హైదరాబాద్‌, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): పదోన్నతుల్లో ఎస్జీటీ(సెకండరీ గ్రేడ్‌ టీచర్‌)లకు న్యాయం చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ డిమాండ్‌ చేశారు. వారిని నియమించినప్పుడు ఒక నియమం, పదోన్నతి కల్పించే సమయంలో మరో నియమం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ సమన్యాయం జరిగేలా ఒక కమిటీని నియమించి విధివిధానాలు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎ్‌సలాగే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఉపాధ్యాయుల హక్కులను కాలరాస్తోందని ఆమె మండిపడ్డారు. కాగా, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సూచన మేరకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, కుంభకోణాల నుంచి బయటపడేందుకు కేసీఆరే ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వాన్ని నడిపిస్తున్నారన్నారు.

Updated Date - Jun 26 , 2024 | 07:29 AM