Share News

Independence Day: గాంధీభవన్‌లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

ABN , Publish Date - Aug 16 , 2024 | 04:44 AM

గాంధీభవన్‌లో 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహే్‌షకుమార్‌ గౌడ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Independence Day: గాంధీభవన్‌లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

  • జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మహే్‌షకుమార్‌ గౌడ్‌

గాంధీభవన్‌లో 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహే్‌షకుమార్‌ గౌడ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యోద్యమంతో సబంధంలేని వారు ఈ రోజు దేశాన్ని పాలిస్తున్నారన్నారు.


కార్పొరేట్‌ శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. జోడో యాత్ర, న్యాయ యాత్రతో రాహుల్‌ గాంధీ దేశ ప్రజల గుండెల్లో నిలిచారని, అధికారంలోకి రాకపోయినా ప్రతిక్ష నాయకుడిగా ఆయన దేశ ప్రజలకోసం పోరాడుతున్నారని మహే్‌షకుమార్‌ గౌడ్‌ అన్నారు.

Updated Date - Aug 16 , 2024 | 04:44 AM