Share News

Mulugu: మేడారం సారలమ్మ పూజారి మృతి..

ABN , Publish Date - Jul 27 , 2024 | 04:02 AM

ములుగు జిల్లా వనదేవతల సన్నిధి మేడారంలో మరో విషాదం చోటుచేసుకుంది. సారలమ్మ ప్రధాన పూజారి కాక సంపత్‌ (38) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు.

Mulugu: మేడారం సారలమ్మ పూజారి మృతి..

మేడారం, జూలై 26: ములుగు జిల్లా వనదేవతల సన్నిధి మేడారంలో మరో విషాదం చోటుచేసుకుంది. సారలమ్మ ప్రధాన పూజారి కాక సంపత్‌ (38) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంపత్‌ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. చికిత్స పొందుతున్నప్పటికీ ఆరోగ్యం కుదటపడలేదు. ఈ నేపథ్యంలో తన స్వగ్రామం తాడ్వాయి మండలం కన్నేపల్లి గ్రామంలో ఆయన మృతి చెందారు.


మృతుడికి భార్య ఆమని, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కుమారుల్లో ఒకరు అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. సంపత్‌ మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా సమ్మక్క పూజారి మల్లెల ముత్తయ్య ఈనెల 20న మృతి చెందారు. వారం రోజుల వ్యవధిలోనే సంపత్‌ మృతితో విషాదం నెలకొంది.

Updated Date - Jul 27 , 2024 | 04:02 AM