Share News

Medaram Jatara: వనం వీడి జనంలోకి సమ్మక్క.. మరి కాసేపట్లో గద్దెలపైకి..

ABN , Publish Date - Feb 22 , 2024 | 09:12 PM

సమ్మక్క-సారలమ్మల నామస్మరణతో మేడారం మహా జాతర (Medaram Maha Jatara) వైభవంగా జరుగుతోంది. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగారాలను భక్తులు సమర్పిస్తున్నారు. అయితే జాతరలో రెండో రోజు జాతరలో అత్యంత కీలక ఘట్టం ప్రారంభమైంది. వనం వీడి జనం మధ్యలోకి సమ్మక్క బయలుదేరింది. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో పూజారుల బృందం చిలుకల గుట్ట సమీపంలోకి చేరుకుంది.

Medaram Jatara: వనం వీడి జనంలోకి సమ్మక్క.. మరి కాసేపట్లో గద్దెలపైకి..

ములుగు: సమ్మక్క-సారలమ్మల నామస్మరణతో మేడారం మహా జాతర (Medaram Maha Jatara) వైభవంగా జరుగుతోంది. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగారాలను భక్తులు సమర్పిస్తున్నారు. అయితే రెండో రోజు జాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనం వీడి జనం మధ్యలోకి సమ్మక్క బయలుదేరింది. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో పూజారుల బృందం చిలుకల గుట్ట దగ్గరలోకి వెళ్లారు.

గుట్టపైకి ప్రధాన పూజారి ఒక్కరే వెళ్లి అక్కడ ఉన్న సమ్మక్క రూపమైన కుంకుమ భరిణ, ఇతర పూజా సామగ్రిని శుద్ధి చేసి కృష్ణయ్య ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ఎస్పీ శబరీష్‌ గాల్లోకి కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో వనదేవతకు స్వాగతం పలికారు. గుట్టపై నుంచి సమ్మక్క గద్దె కిందకు తీసుకొచ్చే వరకు ఆదివాసీ కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు. డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ ఆట పాటలతో సమ్మక్కను గద్దెల వద్దకు ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. సమ్మక్క రాకతో మహాజాతర పరిపూర్ణస్థాయికి చేరనున్నది.

మేడారంకు సంబంధించిన మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 22 , 2024 | 09:41 PM