రచ్చలేపుతున్న రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు..

ABN, Publish Date - Aug 20 , 2024 | 09:43 PM

తెలంగాణ(Telangana) రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం(Rajiv Gandhi Statue) నిప్పు రాజేస్తోంది. తెలంగాణ సచివాలయానికి ఒక వైపు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, ఎదురుగా అమలవీరుల స్మారక స్థూపం గత బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకుని స్థలాన్ని అభివృద్ధి చేసింది.

హైదరాబాద్: తెలంగాణ(Telangana) రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం(Rajiv Gandhi Statue) నిప్పు రాజేస్తోంది. తెలంగాణ సచివాలయానికి ఒక వైపు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, ఎదురుగా అమలవీరుల స్మారక స్థూపం గత బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకుని స్థలాన్ని అభివృద్ధి చేసింది. ఈలోపు తెలంగాణ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించి చకచకా ఏర్పాట్లు చేసి విగ్రహావిష్కరణకు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించారు.


అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. తమ మాట వినకుండా అక్కడ రాజీవ్ విగ్రహం పెడితే భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దాని తొలగిస్తామని, గత పదేళ్లు అధికారంలో ఉన్నా రాజీవ్ ఆరోగ్య శ్రీ, రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేర్లను తాము తొలగించలేదని, కానీ ఈసారి ఈ పేర్లను కూడా తొలగించి తెలంగాణకు చెందిన మహనీయుల పేర్లను పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మలుపులు తిరుగుతున్న ఏపీ మద్యం కుంభకోణం..

ఏపీలో కరువు మాట వినిపించకూడదు..

దేశానికే కుప్పం రోల్ మోడల్: సీఎం బాబు

హైదరాబాద్‌కు రెడ్ అలర్టు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 20 , 2024 | 09:45 PM