Home » JDS
జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై 42వ ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో సిట్ అధికారులు శుక్రవారం చార్జ్షీట్ దాఖలు చేశారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు బీజేపీ మిత్రపక్షాల్లో కీలకంగా మారిన జేడీయూ కూడా ఎర్ర జెండా చూపింది.
ఆదివారం బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నేతలతోపాటు కార్యకర్తలు సైతం పాల్గొనాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే ఈ ఆందోళన కార్యక్రమం శాంతియుతంగా జరగాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.
మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూ కేటాయింపు 'కుంభకోణం'పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, జేడీ(ఎస్) శుక్రవారం తమ నిరసన ప్రదర్శనను కొనసాగించాయి.
ముడా ఇంటి స్థలాల అక్రమాలలో ముఖ్యమంత్రి(Chief Minister) కుటుంబానికి భాగస్వామ్యం ఉందని నిరసిస్తూ బీజేపీ(BJP) చేపట్టిన చలో మైసూరు పాదయాత్ర విజయవంతంగా సాగుతున్న తరుణంలో మరో యాత్ర చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. అనంతరం మరో పాదయాత్ర చేయాలని బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారు.
‘నా ఆస్తులు బహిరంగం చేస్తా... కుమారస్వామి సోదరుడు బాలకృష్ణ గౌడ ఆస్తులు చెప్పాలి’ అని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) సవాల్ విసిరారు. సోమవారం మద్దూరులో కాంగ్రెస్ ప్రజాందోళన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రమంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy) తనను ప్రశ్నిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేహక్కు అందరికీ ఉందని అన్నారు.
జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు వచ్చిన శృంగార వీడియోలు వాస్తవమైనవేనని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది...
లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన జేడీసీ తాజాగా అడ్డం తిరిగింది. కర్ణాటక బీజేపీ తలపెట్టిన పాదయాత్రకు తమ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు.
బిహార్ సీఎం నితీశ్కుమార్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు తీర్పును నిలిపివేయడానికి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం నిరాకరించింది.
మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా)లో తన భార్యకు ఇంటి స్థలాలు కేటాయించడంలో అవినీతి జరగలేదని అయినా బీజేపీ, జేడీఎస్ సభ్యులు తనకు చెడ్డపేరు తీసుకురావాలనే కుట్ర పన్నారని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(CM Siddaramaiah) మండిపడ్డారు. తాను రెండోసారి సీఎం కావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.