Share News

వక్ఫ్‌ సవరణ బిల్లుకు నితీశ్‌ ఎర్ర జెండా

ABN , Publish Date - Aug 24 , 2024 | 04:32 AM

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్‌ సవరణ బిల్లుకు బీజేపీ మిత్రపక్షాల్లో కీలకంగా మారిన జేడీయూ కూడా ఎర్ర జెండా చూపింది.

వక్ఫ్‌ సవరణ బిల్లుకు నితీశ్‌ ఎర్ర జెండా

న్యూఢిల్లీ, ఆగస్టు 23: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్‌ సవరణ బిల్లుకు బీజేపీ మిత్రపక్షాల్లో కీలకంగా మారిన జేడీయూ కూడా ఎర్ర జెండా చూపింది. ఇప్పటికే లోక్‌ జన్‌శక్తి(రామ్‌ విలాస్‌) పార్టీ అధినేత చిరాగ్‌ పాశ్వాన్‌ ఈ బిల్లుపై ప్రశ్నలు సంధించారు.

దీంతో బీజేపీ మిత్రపక్షాల్లోనే ఈ బిల్లును వ్యతిరేకించిన మరో పార్టీగా జేడీయూ నిలిచింది. ముస్లింల ప్రయోజనాలను కాపాడేందుకు బిల్లులో మార్పులు చేయాలని జేడీయూ అధినేత, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బిహార్‌ రాష్ట్రంలో 18 శాతం వరకు ముస్లిం జనాభా ఉంది.

Updated Date - Aug 24 , 2024 | 04:32 AM