Home » Tadepalli Jagan House
Andhrapradesh: గతంలో మాజీ సీఎం జగన్ ఇంటి ముందు రోడ్డు నిర్మాణం కోసం తొలగించిన భరతమాత విగ్రహన్ని తిరిగి ఏర్పాటు చేస్తున్నారు తాడేపల్లి వాసులు. సీఎం నివాసానికి వెళ్లే దారిలో నాలుగురోడ్లు, మధ్యలో డివైడర్, లాన్, వింటేజ్ లైట్లు, స్లైడింగ్ పార్కు ఏర్పాటు కోసం భరతమాత విగ్రహాన్ని అప్పటి సీఎం జగన్ తొలగించి వేశారు. భరతమాత సెంటర్లో విగ్రహాన్ని తొలగించడానికి వీలులేదని అప్పట్లో స్థానికులు ఆందోళనలు కూడా చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి భారతి బెంగళూరు పర్యటన ముగించుకుని మంగళవారం నాడు ఏపీకి వచ్చారు. కాసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు.
Andhra Pradesh: ఎంత ముఖ్యమంత్రి అయితే మాత్రం మా ఇంటికి మమ్మల్ని వెళ్లనివ్వరా..? నిత్యం తిరిగే వాళ్లమైనా..
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్.. గతంలో అధికారంలో ఉండగా ఆయన తన భద్రత కోసం తీసుకున్న చర్యలపై ప్రస్తుతం సర్వత్ర ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఓ ముఖ్యమంత్రిగా ఆయన అసాధారణ రీతిలో తన భద్రత కోసం చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పేరుకు ప్రజాపాలన.. కానీ చేసింది మాత్రం ప్రజల సొమ్మును దోచుకోవడం.. పార్టీ అవసరాల కోసం ప్రభుత్వ భూములను చవకగా కొట్టేసి.. నిబంధనలు పాటించకుండా పార్టీ కార్యాలయాలను నిర్మాణం చేయడం.. ఇది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజాపాలన మాటున జరిగింది.
అమరావతి: తాడేపల్లిలోని వైసీపీ అక్రమ నిర్మాణం కూల్చివేతతో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్టీ కార్యాలయాల పేరుతో వైసీపీ వందల కోట్ల విలువైన భూములు కొట్టేసిన వైనంపై అధికారులు లెక్కలు తీస్తున్నారు.
తాడేపల్లి ప్యాలెస్ నిర్మాణంలో ఉన్నప్పటి చిత్రమిది! బకింగ్ హామ్ కెనాల్, దాని కట్టపైన రోడ్డు,
ఈనెల 19న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) అధ్యక్షతన ఈనెల 19న ఉదయం 10:30గంటలకు తాడేపల్లి(Tadepalli) క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బలగమెంత..? మాజీ సీఎంతో ఎంత మంది ఉన్నారు..? ఎన్నికల ముందు.. ఫలితాల తర్వాత వైసీపీ పరిస్థితి ఎలా ఉంది..? ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు..? వైసీపీ (YSR Congress) మళ్లీ పుంజుకునేది ఎప్పుడు..? అసలు అది అయ్యే పనేనా..? ఇలా ఒకటా రెండా వందల సంఖ్యలో ప్రశ్నలు వస్తున్నాయి..
ముఖ్యమంత్రి హోదాలో జగన్ తాడేపల్లిలోని సొంత ఇంటినే క్యాంపు ఆఫీసుగా మార్చేసుకొని సకల రాజభోగాలు అనుభవించారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో సకల ఆడంబరాలు, వసతులు కల్పించుకున్నారు. సచివాలయానికి వెళ్లకుండానే ఇంటి నుంచే వ్యవహారం నడిపించారు. ముఖ్యమంత్రి భద్రత కోసం ఎంత ఖర్చు చేసినా ఎవరూ తప్పుపట్టరు.