Home » Tiruvuru
తిరువూరులో గత వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన రేషన్ బియ్యం అక్రమ వ్యాపారికి మరో వ్యాపారికి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఏ.కొండూరు మండలం గోపాలపురం వద్ద ఒక రేషన్ వ్యాపారికి చెందిన లారీని మరో వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు అడ్డగించారు.
తిరువూరులో దేవదాయ శాఖ అధీనంలో ఉన్న స్థలాన్ని వైసీపీ కౌన్సిలర్ దార నీలిమ భర్త శ్రీనివాసరావు ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన వివాదాస్పద దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కె.శాంతి అండదండలతో నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై కేసు నమోదయింది. ఏ. కొండూరు మండలం కంభంపాడులో నిన్న (మంగళవారం) వైసీపీ ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త కాలసాని చెన్నారావు ఇంటిని కూల్చిన ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Andhrapradesh: నిరు పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు తమ స్వలాభాలకు ఉపయోగించుకుంటున్నారు. అనేక విధాలుగా రేషన్ అక్రమ రవాణాలకు అధికారులు అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ ఎక్కడో చోట బియ్యం అక్రమ తరలింపులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు శాసనసభ నియోజకవర్గం నుంచి మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఈవీఎం బ్యాలెట్లో 13 వరుసలు ఉండగా.. మొదటి 12 అభ్యర్థులకు సంబంధించిన గుర్తులు, చివరిది నోటా. మొదటి నలుగురు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కాగా.. మిగతా 8 మంది రిజిస్టర్డ్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు.
Andhrapradesh: టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తలపెట్టిన ‘‘నిజం గెలవాలి’’ యాత్ర పూర్తి అయ్యింది. శనివారం తిరువూరు నియోజకవర్గంలో భువనమ్మ పర్యటించారు. ఈ సందర్భంగా అధినేత చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన కుంచం సుబ్బారావు, కాకర్ల విశ్వనాథం కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ఆయా కుటుంబాలకు భరోసా ఇచ్చారు. తిరువూరులో పర్యటనతో భువనేశ్వరి నిజం గెలవారి యాత్ర ముగిసింది.
కృష్ణా జిల్లా తిరువూరులో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. సవాళ్లు.. ప్రతి సవాళ్లతో టీడీపీ, వైసీపీ నేతలు తిరువూరును యుద్ధ భూమిగా మార్చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడిని ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తిరువూరులో టీడీపీ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో స్వామి దాస్ తాగుబోతు, సుధారాణి బంది పోటు అంటూ కొలికపూడి వ్యక్తిగత విమర్శలు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తిరువూరు వైసీపీ సీట్ తనకి రాదని సమాచారం రావటంతో మనస్తపం చెందిన రక్షణ నిధి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది.
ఎన్టీఆర్ జిల్లా: జగన్రెడ్డి రివర్స్ పాలనలో ఆంధ్రప్రదేశ్ 30 యేళ్లు వెనక్కిపోయిందని, హైదరాబాద్ వెలిగిపోతుంటే.. అమరావతి వెలవెలపోతోందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగుజాతి గ్లోబల్ నాయకులుగా ఎదిగేందుకు టీడీపీ ఉపయోగపడిందని అన్నారు.
Andhrapradesh: జిల్లాలోని తిరువూరులో నిన్న(బుధవారం) టీడీపీ కార్యాలయంలో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరువూరు సెక్టార్ 1 ఎస్సై సతీష్ ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలు 36 మంది కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.