Home » TOP NEWS
ఈ ఎన్నికల్లో వైసీపీపై(YCP) ఉన్న వ్యతిరేకతను ప్రజలు తమ ఓట్ల రూపంలో చూపిస్తారని.. దెబ్బకు వైసీపీ ఫ్యాన్ రెక్కలు ముక్కలవడం ఖాయం అని చంద్రబాబు(Chandrababu) అన్నారు. గురువారం నాడు చంద్రబాబు నాయుడు కురుపాంలో(Kurupam) నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో..
ఓట్ల పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది పార్టీల ప్రచారం, రాజకీయ పార్టీల మధ్య విమర్శలు.. ఎక్కడ చూసినా పార్టీ జెండాలు.. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్ది అభ్యర్థుల్లో టెన్షన్.. వీటన్నింటికి తోడు చివరి రెండు రోజులు అంటే పంపకాల సమయం.. ఇటీవల కాలంలో ఓటుకు నోట్ల పంపిణీ ఎక్కువైపోయింది. కావాలని ఓటర్లు అడగకపోయినా.. డబ్బులిస్తే ఓట్లు వేస్తారనే ఆశతో ప్రధాన పార్టీలు డబ్బుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నాయి.
నగిరి నియోజకవర్గాన్ని దోచేసిన మంత్రి రోజాను ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు సీపీఐ జాతీయ నేత నారాయణ పిలుపునిచ్చారు. ఇవాళ తిరుపతిలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. నగిరిలో రోజా ఊళ్లకు ఊళ్లే దోచేసిందన్నారు. ఇష్టారాజ్యంగా ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ రవాణాతో నగిరి నియోజకవర్గాన్ని పూర్తిగా దోచేసిందని అన్నారు. నగిరిలో మంత్రి రోజా పాలనలో దౌర్జన్యాలు, అరాచకాలు, అవినీతి ఎక్కువైందన్నారు.
కేశినేని చిన్ని (శివనాథ్ ) ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు క్యూలు కడుతున్నారు. ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి కృష్ణమోహన్ , కార్యవర్గంతో సహా ఐదు వందల మంది నేడు టీడీపీలో చేరారు. వారికి కేశినేని చిన్ని పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
పోలింగ్కు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్సభ ఎన్నికలు-2024లో విజేత ఎవరు అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ పొలిటీషియన్, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఆసక్తికరమైన సర్వే రిపోర్టును ప్రకటించారు. జిల్లాల వారీగా తనకున్న సర్వే నివేదికలను ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఖచ్చితంగా గెలిచి తీరుతుందని ఆయన అంచనా వేశారు.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు-2024 సమీపిస్తున్న తరుణంలో ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నట్టుగా రేషన్ డీలర్ల రాష్ట్ర సమాఖ్య గురువారం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించింది. రేషన్ డీలర్ల రాష్ట్ర సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దేశ సార్వత్రిక ఎన్నికల సమరంలో గెలిచేదెవరు.. కేంద్రంలో అధికారం చేపట్టేదెవరు.. ఇప్పటికే మూడు విడతల్లో సగానికి పైగా లోక్సభ స్థానాల్లో(Lok Sabha Seats) ఎన్నికలు పూర్తయ్యాయి. మొదటి మూడు విడతల్లో ఎవరిది అధిపత్యం అనేదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. మొదటి మూడు విడతల్లో పోలింగ్ తక్కువ నమోదైంది. బీజేపీకి ఈ మూడు విడతల్లో ఎదురుదెబ్బ తగిలిందని ఇండియా కూటమి ఆరోపిస్తుంటే.. ఎన్డీయే(NDA) బలం గతంకంటే పెరిగింది.. ఇండియా కూటమికి గతంలో వచ్చిన సీట్లు రావంటూ బీజేపీ(BJP) చెబుతోంది. ఈ క్రమంలో మొదటి మూడు విడతల్లో ఎవరిది అధిపత్యం అనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై సీబీఐ షాక్ ఇచ్చింది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ నెల17 నుంచి జూన్ 1 వరకూ యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు. కుటుంబంతో జెరూసలేం, లండన్, స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉందన్నారు. లండన్లో కుమార్తెలు ఉండడంతో వారితో ఉండేందుకు విదేశాలకు వెళుతున్నారని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు.
మరో నాలుగు రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 (AP Election 2024) జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు జగన్ చేస్తున్న కుటీల ప్రయత్నాలకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. సంక్షేమ పథకాల పేరుతో పోలింగ్కు 2 రోజుల ముందు డబ్బులు పంపిణీ చేయాలనే ప్రయత్నాలను తిప్పికొట్టింది. సంక్షేమ పథకాల సొమ్ముల చెల్లింపునకు కేంద్ర ఎన్నికల సంఘం నో చెప్పింది.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆదిలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి, తుమ్మల యుగంధర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పొంగులేటి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.