Chandrababu: కాసేపట్లో కియా కార్ల పరిశ్రమ వద్దకు చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్..

ABN , First Publish Date - 2023-08-03T16:46:15+05:30 IST

కాసేపట్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) పెనుగొండలోని కియా కార్ల పరిశ్రమ వద్దకు చేరుకోనున్నారు.

Chandrababu: కాసేపట్లో కియా కార్ల పరిశ్రమ వద్దకు చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్..

అనంతపురం: కాసేపట్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) పెనుగొండలోని కియా కార్ల పరిశ్రమ వద్దకు చేరుకోనున్నారు. టీడీపీ హయాంలో వచ్చిన కియా కార్ల పరిశ్రమ వద్ద సెల్ఫీ తీసుకుని వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు ఛాలెంజ్ విసరనున్నారు. వైసీపీ అనంతపురం జిల్లాకు తెచ్చిన పరిశ్రమలు ఎన్నో? పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులు ఎన్నో చెప్పాలంటూ ఛాలెంజ్ చేయనున్నారు.


"టీడీపీ హయాంలో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి గొల్లపల్లి ప్రాజెక్ట్ నుంచి కియా కార్ల పరిశ్రమ అవసరాలకు నీటి సరఫరా చేశాం. రికార్డ్ సమయంలో దాదాపు రూ.13 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ ఏర్పాటు, కార్ల ఉత్పత్తి. ఇటీవల 10 లక్షల కార్ల ఉత్పత్తి పూర్తి చేసుకున్న కియా అనంతపురం పరిశ్రమ. కియా కార్ల అమ్మకాలు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది." అని చంద్రబాబు అన్నారు.

Updated Date - 2023-08-03T17:00:57+05:30 IST