Share News

Purandhareswari : జీతాలు చెల్లించలేని స్థితిలో ఏపీ ఉంది

ABN , First Publish Date - 2023-11-28T17:19:12+05:30 IST

జీతాలు చెల్లించలేని స్థితిలో ఏపీ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ( Purandhareswari ) వ్యాఖ్యానించారు. రాష్ట్ర పరిస్థితి చూస్తే అప్పుల ఊబిలో ఎలా కురుకు పోయిందో చూస్తున్నామని చెప్పారు. బీజేపీ కేంద్రంలో సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని రాష్ట్ర పరిస్థితి ఆందోళన కరంగా ఉందని పురంధరేశ్వరి అన్నారు.

Purandhareswari : జీతాలు చెల్లించలేని స్థితిలో ఏపీ ఉంది

విజయనగరం: జీతాలు చెల్లించలేని స్థితిలో ఏపీ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ( Purandhareswari ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు బీజేపీ కార్యాలయంలో పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్ర పరిస్థితి చూస్తే అప్పుల ఊబిలో ఎలా కురుకు పోయిందో చూస్తున్నామని చెప్పారు. బీజేపీ కేంద్రంలో సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని రాష్ట్ర పరిస్థితి ఆందోళన కరంగా ఉందన్నారు. సామాజిక సాధికార యాత్ర చేయడానికి వైసీపీ ఏమి అర్హత ఉందని ప్రశ్నించారు. సాధికార యాత్ర ఎందుకు చేస్తున్నారో వారికే తెలీదని పురంధరేశ్వరి పేర్కొన్నారు.

Updated Date - 2023-11-28T17:19:15+05:30 IST