YS Viveka: వైఎస్ వివేకా కేసులో జమ్మలమడుగు కోర్టుకు సీబీఐ.. ఎందుకంటే..?
ABN , Publish Date - Dec 30 , 2023 | 08:30 PM
వైఎస్ వివేకానందారెడ్డి ( YS Vivekananda Reddy ) కేసుకు సంబంధించి జమ్మలమడుగు కోర్టుకు సీబీఐ అధికారులు వెళ్లారు. హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ కాపీలను కోర్టుకు సీబీఐ అధికారులు సమర్పించారు. నాటి సీబీఐ విచారణాధికారి రామ్సింగ్, వివేకాకుమార్తె సునీత, రాజశేఖర్రెడ్డిపై పులివెందుల కోర్టులో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు.
![YS Viveka: వైఎస్ వివేకా కేసులో జమ్మలమడుగు కోర్టుకు సీబీఐ.. ఎందుకంటే..?](https://media.andhrajyothy.com/media/2023/20231205/1_YS_VIVEKA_1272964589.jpg)
కడప: వైఎస్ వివేకానందారెడ్డి ( YS Vivekananda Reddy ) కేసుకు సంబంధించి జమ్మలమడుగు కోర్టుకు సీబీఐ అధికారులు వెళ్లారు. హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ కాపీలను కోర్టుకు సీబీఐ అధికారులు సమర్పించారు. నాటి సీబీఐ విచారణాధికారి రామ్సింగ్, వివేకాకుమార్తె సునీత, రాజశేఖర్రెడ్డిపై పులివెందుల కోర్టులో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసును క్యాష్ చేయాలని హైకోర్టును రాంసింగ్, సునీత, రాజశేఖర్రెడ్డిలు ఆశ్రయించారు. ఆ కాపీలను జమ్మలమడుగు కోర్టులో సీబీఐ అధికారులు అందజేశారు. జమ్మలమడుగు మెజిస్ట్రేట్ భార్గవి.. పులివెందుల కోర్టుకు ఇన్చార్జి కావడంతో సీబీఐ అధికారులు కాపీలు అందజేశారు.