Share News

NRI BRS Cell Bahrain: ఎవరెన్ని కుట్రలు చేసినా హ్యాట్రిక్‌ కొట్టేది బీఆర్ఎస్‌ పార్టీయే

ABN , First Publish Date - 2023-11-05T07:52:52+05:30 IST

ఎన్నారై బీఆర్ఎస్‌ బహ్రెయిన్ శాఖ కార్యవర్గ సమావేశంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.

NRI BRS Cell Bahrain: ఎవరెన్ని కుట్రలు చేసినా హ్యాట్రిక్‌ కొట్టేది బీఆర్ఎస్‌ పార్టీయే

ఎన్నారై బీఆర్‌యస్ బహ్రెయిన్ శాఖ ప్రత్యేక సమావేశం

NRI BRS Cell Bahrain: ఎన్నారై బీఆర్ఎస్‌ బహ్రెయిన్ శాఖ కార్యవర్గ సమావేశంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్‌ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ... 60 ఏండ్లు అధికారంలో ఉండి ఇటు గల్ఫ్ దేశంలో ఉండే తెలంగాణ బిడ్డలను పట్టించుకోలేదని, అటు ప్రజల కష్టాలను పట్టించుకోలేరని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రవాసులు గల్ఫ్‌కు పోవడానికి కారణం కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. అలాగే గల్ఫ్ కార్మికుల కనీస వేతనాలను తగ్గించాలంటూ సర్క్యూలర్లు జారీ చేసింది బీజేపీ ప్రభుత్వం అని మండిపడ్డారు. ప్రపంచంలో తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్నా వారిని కడుపులో పెట్టుకొని చూసుకునేది సీఎం కేసీఆరేనని అన్నారు. 60 ఏండ్లలో చేయని అభివృద్ధి తొమ్మిదిన్నర ఏండ్లలో చేసి చూపించారని సీఎం కేసీఆర్‌ను ప్రశంసించారు. ఎన్నారై బీఆర్ఎస్‌ బహ్రెయిన్ ఆధ్వర్యంలో గల్ఫ్ కుటుంబాలు నివసించే వారి క్యాంపులకు వెళ్లి ఎన్నికల ప్రత్యేక ప్రచారం చేయడం జరిగిందన్నారు. గల్ఫ్‌లో తెలంగాణ వాసులను ఎవరిని అడిగిన కేసీఆర్ ప్రకటించిన ప్రజా మేనిఫెస్టో ఆచరణాత్మకంగా, విశ్వసనీయంగా ఉందని, కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు సైతం హర్షిస్తున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని, దేశానికే ఆదర్శమని కొనియాడారు. కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవ్వడం పక్కా అని జోస్యం చెప్పారు.

ప్రధాన కార్యదర్శిలు పుప్పాల బద్రి, మగ్గిడి రాజేందర్, కార్యదర్శులు చెన్నమనేని రాజేందర్, సంగేపోలు దేవన్నమాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనే దమ్ములేక బీఆర్ఎస్ నాయకులపై భౌతిక దాడులు చేయడం ఏంటని మండిపడ్డారు. పచ్చటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నెత్తుటి రాజకీయాలను ఎన్నారై బీఆర్ఎస్‌ బహ్రెయిన్ శాఖ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. స్వేచ్ఛాయుతా వాతావరణంలో ఎన్నికలు జరుగాలన్నారు. దాడి ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా సరైన పద్ధతి కాదన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణను ఆగం కానివొద్దని, హింసా రాజకీయాలకు పాల్పడే పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని సూచించారు. తెలంగాణలో జరుగుతున్నా అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుటిల రాజకీయాలు చేస్తున్నాయని దుమ్మెత్తిపోశారు. ఎన్నికల్లో నాలుగు ఓట్ల కోసం నీచమైన చావ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల్లో ఆదరణ కరువై, ప్రజల మన్నన ఎలా పొందాలో తెలియక ఇలాంటి మతితప్పిన పనులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ప్రజల్లో సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ప్రతి పక్షాలకు ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. ప్రజల్లో అపోహలను పెంచి, విద్వేషాలు రగిలించి ఓట్లు దండుకునేందుకు తెలంగాణ వ్యతిరేక శక్తులు ఏకమయ్యాయని అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కూటమి కుట్రలను మరోసారి తిప్పి కొట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని, వారు చేస్తున్న కుట్రలు ప్రజల్లో తమవంతు భాద్యతగా గడప గడపకు తెలియజేస్తామన్నారు. అలాగే సీఎం కేసీఆర్ గత తొమ్మిదేళ్లుగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఓటు వేసి బీఆర్‌యస్ అభ్యర్ధులను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి పక్షాలకు తగిన గుణ పాఠం చెప్పాలని కోరతామని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్‌యస్‌ సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి, ప్రధాన కార్యదర్శి పుప్పాల బద్రి, మగ్గిడి రాజేందర్, కార్యదర్శులు చెన్నమనేని రాజేందర్, సంగేపోలు దేవన్న బీఆర్‌బీఆర్‌ఎస్‌ నాయుకులు హాజరైన వారిలో ఉన్నారు.

Updated Date - 2023-11-05T07:52:53+05:30 IST