Mother: రాత్రి 10 గంటల సమయం.. తల్లి చేతిలో మొబైల్‌ను చూసిన 17 ఏళ్ల కుర్రాడు.. తెల్లారేసరికి షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2023-08-22T18:25:11+05:30 IST

అనుమానం పెనుభూతం.. అని పెద్దలు అంటూ ఉంటారు. కానీ కొందరికి ఇది పెద్ద జబ్బులా తయారవుతూ ఉంటుంది. చీటికీమాటికీ కుటుంబ సభ్యులను అనుమానించడం, కొన్నిసార్లు అదే నిజం అనుకుని వేధించడం చేస్తుంటారు. భార్యను భర్త, భర్తను భార్య అనుమానించడం తరచూ జరుగుతూనే ఉంటుంది. అయితే...

Mother: రాత్రి 10 గంటల సమయం.. తల్లి చేతిలో మొబైల్‌ను చూసిన 17 ఏళ్ల కుర్రాడు.. తెల్లారేసరికి షాకింగ్ సీన్..!
ప్రతీకాత్మక చిత్రం

అనుమానం పెనుభూతం.. అని పెద్దలు అంటూ ఉంటారు. కానీ కొందరికి ఇది పెద్ద జబ్బులా తయారవుతూ ఉంటుంది. చీటికీమాటికీ కుటుంబ సభ్యులను అనుమానించడం, కొన్నిసార్లు అదే నిజం అనుకుని వేధించడం చేస్తుంటారు. భార్యను భర్త, భర్తను భార్య అనుమానించడం తరచూ జరుగుతూనే ఉంటుంది. అయితే తల్లిని అనుమానించే కొడుకు ఎక్కడా ఉండడు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటనలో ఓ ప్రబుద్ధుడు తల్లి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. రాత్రి 10గంటల సమయంలో తల్లి చేతిలో మొబైల్ చూసిన కొడుకు.. ఇంత రాత్రి వేళ ఎవరికి మెసేజ్ చేస్తోందా.. అని అనుమానపడ్డాడు. చివరకు ఏం జరిగిందంటే..

మహారాష్ట్రలోని (Maharashtra) పాల్ఘర్ జిల్లా వసాయ్ టౌన్‌షిప్ పరిధి పెరోల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన సోనాలి గోగ్రా (35) అనే మహిళన.. తన 17ఏళ్ల కొడుకుతో కలిసి నివాసం ఉంటోంది. ఇదిలావుండగా, ఆదివారం జరిగిన ఘటనతో స్థానికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాత్రి కొడుక్కి భోజనం వడ్డించిన తల్లి.. పక్కకు వెళ్లి సెల్ చూసుకుంటూ కూర్చుంది. భోజనం చేసిన కొడుకు.. తర్వాత తన తల్లి ఫోన్‌లో ఎవరికో మెసేజ్ చేస్తున్నట్లు గమనించాడు. అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న కొడుకు.. ఈ ఘటనతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు.

Skin Care: ముఖానికి క్రీమ్స్ వాడుతున్నారా..? రాసుకోగానే ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పారేసేయండి..!

పక్కనే ఉన్న గొడ్డలిని తీసుకుని.. తల్లిపై విచక్షణారహితంగా (Son attack on mother) దాడి చేశాడు. ఆమె కేకలు విని చుట్టుపక్కల వారు పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. రక్తపుమడుగులో పడి ఉన్న సోనాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదురు బాలుడికి తల్లిపై అనుమానం ఉండేదని, తన తల్లి ఎవరితోనే వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని కోపం పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో తల్లీకొడుకు మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని తెలిసింది. కాగా, ఈ హత్య ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Bride Stunts: బాబోయ్.. ఇవేం స్టంట్స్..? వరుడి మెడకు కాలును చుట్టి.. మరో కాలుని తొడపై పెట్టి.. ఓ వధువు వింత విన్యాసాలు..!

Updated Date - 2023-08-22T18:27:41+05:30 IST