Share News

TS Elections: బీఆర్ఎస్-బీజేపీ శ్రేణుల ఘర్షణ.. డబ్బు పంపిణీపై పోలీసులు స్పందించలేదని బండి సంజయ్ ఫైర్

ABN , First Publish Date - 2023-11-28T22:39:04+05:30 IST

కొత్తపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ - బీజేపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

TS Elections: బీఆర్ఎస్-బీజేపీ శ్రేణుల ఘర్షణ.. డబ్బు పంపిణీపై పోలీసులు స్పందించలేదని బండి సంజయ్ ఫైర్

కరీంనగర్ జిల్లా: కొత్తపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ - బీజేపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల పంపిణీ జరుగుతోందని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆరెస్ నేతలు డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Updated Date - 2023-11-28T22:44:46+05:30 IST