Minister Mahender Reddy : త్వరలోనే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం

ABN , First Publish Date - 2023-09-05T16:58:41+05:30 IST

త్వరలోనే 6వేల ఉపాధ్యాయ పోస్టులను (Teacher posts) భర్తీ చేస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి (Minister Patnam Mahender Reddy)తెలిపారు.

Minister Mahender Reddy : త్వరలోనే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం

వికారాబాద్ జిల్లా: త్వరలోనే 6వేల ఉపాధ్యాయ పోస్టులను (Teacher posts) భర్తీ చేస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి (Minister Patnam Mahender Reddy)తెలిపారు. మంగళవారం నాడు ఉపాధ్యాయ దినోత్సవం (Teacher's Day)సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 75మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం 1 లక్ష 87 వేల కోట్ల నిధులను ఖర్చు చేస్తోంది. సర్వ శిక్ష అభియాన్ ద్వారా 192 మంది దివ్యాంగ విద్యార్థులకు రూ. 5లక్షల రూపాయల నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, అడిషనల్ కలెక్టర్లు లింగాయత్, రాహుల్ శర్మ, శిక్షణ అధికారి అమిత్ నారాయణ, డీఈఓ రేణుకాదేవి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-05T16:58:56+05:30 IST