Share News

Chandrababu: ‘రా కదిలి రా’ బహిరంగ సభకు వైసీపీ వాహనాల్లో వచ్చిన పోలీసులు.. చంద్రబాబు భద్రతను గాలికి వదిలేసి..

ABN , Publish Date - Mar 05 , 2024 | 08:00 AM

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ రా కదిలి రా బహిరంగ సభకు వైసీపీ నేతల వాహనాల్లో పోలీసులు వచ్చి హల్‌చల్ చేశారు. సభకు హాజరైన టీడీపీ నేతలు, కార్యకర్తలను వీడియో తీశారు. మా నమ్మకం నువ్వే జగన్ అని రాసి ఉన్న వాహనాల్లో వచ్చి సభా వేదిక వద్ద అలజడి సృష్టించారు. ఎందుకు వీడియోలు తీస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా పట్టించుకోలేదు.

Chandrababu: ‘రా కదిలి రా’ బహిరంగ సభకు వైసీపీ వాహనాల్లో వచ్చిన పోలీసులు.. చంద్రబాబు భద్రతను గాలికి వదిలేసి..

అనంతపురం: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ రా కదిలి రా బహిరంగ సభకు వైసీపీ (YCP) నేతల వాహనాల్లో పోలీసులు వచ్చి హల్‌చల్ చేశారు. సభకు హాజరైన టీడీపీ (TDP) నేతలు, కార్యకర్తలను వీడియో తీశారు. మా నమ్మకం నువ్వే జగన్ (CM Jagan) అని రాసి ఉన్న వాహనాల్లో వచ్చి సభా వేదిక వద్ద అలజడి సృష్టించారు. ఎందుకు వీడియోలు తీస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా పట్టించుకోలేదు.

సభా వేదిక వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) భద్రతను గాలికి వదిలేసి కేవలం వీడియోలు తీయడంపైనే ఫోకస్ పెట్టారు. ట్రాఫిక్ నియంత్రణ పేరుతో రా కదలిరా బహిరంగ సభకు వస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. బహిరంగ సభ ముగిసే సమయానికి వేదిక వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకోలేకపోయారు. పోలీసులు అడ్డుకోవడం వల్లే సభకు సకాలంలో చేరుకోలేకపోయామంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2024 | 08:20 AM