Share News

AP NEWS: తిరుపతి‌కి పుట్టినరోజు పండుగ ఉంది: భూమన కరుణాకర రెడ్డి

ABN , Publish Date - Feb 18 , 2024 | 08:58 PM

ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకుంటున్నామని ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి (Bhumana Karunakar Reddy) వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా అద్భుత గడియలను గుర్తు చేసుకుంటున్నామని తెలిపారు.

AP NEWS: తిరుపతి‌కి పుట్టినరోజు పండుగ ఉంది: భూమన కరుణాకర రెడ్డి

తిరుపతి జిల్లా: ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకుంటున్నామని ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి (Bhumana Karunakar Reddy) వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా అద్భుత గడియలను గుర్తు చేసుకుంటున్నామని తెలిపారు. గోవిందరాజ పట్నం అంచెలంచెలుగా ఎదిగి తిరుపతి మహానగరమైందని చెప్పారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మామూలుగా మనుషులకు పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటారని తెలిపారు.

తిరుపతి నగరానికి పుట్టినరోజు పండుగ ఉందన్నారు. నగరమంతా పుట్టినరోజు పండుగ చేసుకుందామని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 24వ తేదీ గోవిందరాజ స్వామి ఆలయం నుంచి పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ చేద్దాం రావాలని పిలుపునిచ్చారు. ఇది రాజకీయాలకు అతీతంగా తిరుపతి పుట్టినరోజు చేసుకుంటున్నామని వివరించారు. మొదటి రెండేళ్లు అత్యద్భుతంగా చేసుకున్నామని తెలిపారు. 894వ పుట్టినరోజు వేడుకలు పోస్టర్‌ను భూమన కరుణాకర రెడ్డి ఆవిష్కరించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 18 , 2024 | 08:59 PM