Share News

TG CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ పర్యటన.. ఎందుకో తెలుసా?

ABN , Publish Date - Jul 07 , 2024 | 07:50 PM

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) 75వ జయంతి వేడుకలు ఈనెల 8న ఘనంగా నిర్వహించనున్నారు. మంగళగిరి సీకే(CK) కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకకు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకానున్నారు.

TG CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ పర్యటన.. ఎందుకో తెలుసా?

అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) 75వ జయంతి వేడుకలు ఈనెల 8న ఘనంగా నిర్వహించనున్నారు. మంగళగిరి సీకే(CK) కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకకు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకానున్నారు.


రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం 4గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అనంతరం మంగళగిరి చేరుకుని 5నుంచి 6:30గంటల వరకు వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. రాత్రి 7గంటలకు తిరిగి గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్, రాష్ట్రస్థాయి నేతలు పాల్గొంటారు.

ఇది కూడా చదవండి:

YSR Birthday celebrations: ఈనెల 8న ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు..

Updated Date - Jul 07 , 2024 | 07:57 PM