Share News

Varla Ramaiah: ప్రజాభీష్టం ప్రకారమే ఎన్డీఏ పాలన: వర్ల రామయ్య

ABN , Publish Date - Jun 13 , 2024 | 08:45 PM

ప్రజాభీష్టం ప్రకారమే ఎన్డీఏ పాలన నడుస్తుందని తెలుగుదేశం పొలిట్ బ్యూర్ సభ్యుడు వర్లరామయ్య (Varla Ramaiah) పేర్కొన్నారు. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టడంతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో సంబురాలు చేసుకుంటున్నారు.

Varla Ramaiah: ప్రజాభీష్టం ప్రకారమే ఎన్డీఏ పాలన: వర్ల రామయ్య
Varla Ramaiah

అమరావతి: ప్రజాభీష్టం ప్రకారమే ఎన్డీఏ పాలన నడుస్తుందని తెలుగుదేశం పొలిట్ బ్యూర్ సభ్యుడు వర్లరామయ్య (Varla Ramaiah) పేర్కొన్నారు. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టడంతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో సంబురాలు చేసుకుంటున్నారు. ఈ వేడుకల్లో వర్లరామయ్య, కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.. రాష్ట్రానికి పట్టిన పీడ వదలడమే కాకుండా ప్రజా పరిపాలన తిరిగి అధికారంలోకి వచ్చిందని ఉద్ఘాటించారు.


జగన్ రెడ్డి అరాచక, అవినీతి, విధ్వంసక, నియంత పాలన తమకొద్దని ప్రజా ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల ప్రకారం మొదట ఐదు ఫైళ్లపై సంతకం చేశారని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన ప్రతీ వాగ్ధానానికి కట్టుబడి ఉంటాం.. ప్రతీ హామీని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించడానికి నేడు సీఎం చంద్రబాబు శంఖారావం పూరించారని వర్లరామయ్య పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Ramanaidu: వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ పెన్షన్

Chandrababu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. మొదటి సంతకం ఈ ఫైల్‌పైనే..!

AP News: రాష్ట్రపతి ముర్మును కలిసిన విష్ణువర్ధన్ రెడ్డి .. ఎందుకంటే..?

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - Jun 13 , 2024 | 08:47 PM