Share News

AP News: వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అంటూ యువతిపై ఎమ్మెల్యే అనుచరుడి అత్యాచారం..

ABN , Publish Date - May 06 , 2024 | 11:35 AM

Andhrapradesh: ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుచరుడిపై ఫాక్సో, అత్యాచార కేసు నమోదు అయ్యింది. వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు వడ్ల దాదాపీర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపీర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

AP News: వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అంటూ యువతిపై ఎమ్మెల్యే అనుచరుడి అత్యాచారం..
POCSO case against YCP MLAs flower

కడప, మే 6: ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (YSRCP MLA Rachamallu Shivaprasad Reddy) అనుచరుడిపై ఫాక్సో, అత్యాచార కేసు నమోదు అయ్యింది. వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు వడ్ల దాదాపీర్‌పై (MLA Follower) కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపీర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎవరు లేని సమయంలో ఇంటికి వచ్చి లొంగదీసుకుని శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే (YSRCP Government) అని... విషయం బయటికి చెప్తే చంపేస్తానని బెదిరించారని బాధితురాలు వెల్లడించింది.

Land Titling Act: ‘నేను ప్రత్యక్ష బాధితుడినే’..లాండ్ టైటిలింగ్ యాక్ట్‌‌పై మాజీ ఐఏఎస్ ట్వీట్


తనను లైంగికంగా వేధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టి వైరల్ చేస్తానంటూ బెదిరిస్తున్నారని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఆఖరికు తన నిశ్చితార్థాన్ని కూడా చెడకొట్టాడని కన్నీటిపర్యంతమైంది. వడ్ల దాదాపీర్ నుంచి రక్షణ కల్పించాలని యువతి పోలీసులను ఆశ్రయించారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ అనుచరుడు దాదాపీర్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.


ఇవి కూడా చదవండి...

YS Sharmila: జగన్‌ను పైసా సాయం అడగలే, నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై చెబుతా..!!

Lok Sabha Polls:మూడో విడతలో ప్రముఖులు.. అమిత్‌ షా గట్టెక్కుతారా..!

Read Latest AP News And Telugu news

Updated Date - May 06 , 2024 | 01:28 PM