Share News

YS Sharmila: ప్రత్యేక జీవనశైలి ఆదివాసీల సొంతం

ABN , Publish Date - Aug 09 , 2024 | 02:46 PM

Andhrapradesh: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన బిడ్డలకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అపురూపం ఆదివాసి సంస్కృతి అని కొనియాడారు. సంప్రదాయాలు, కట్టుబాట్లతో జీవనం.. విలక్షణమైన ఆహార్యం.. గొప్ప ఐక్యత, అడవితల్లి ఒడిలోనిత్యం ఒదిగి సాగే పయనం.. ఇలా ప్రత్యేక జీవనశైలి ఆదివాసీల సొంతమన్నారు.

YS Sharmila: ప్రత్యేక జీవనశైలి ఆదివాసీల సొంతం
APCC Chief YS Sharmila

అమరావతి, ఆగస్టు 9: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన బిడ్డలకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) శుభాకాంక్షలు తెలిపారు. అపురూపం ఆదివాసి సంస్కృతి అని కొనియాడారు. సంప్రదాయాలు, కట్టుబాట్లతో జీవనం.. విలక్షణమైన ఆహార్యం.. గొప్ప ఐక్యత, అడవితల్లి ఒడిలోనిత్యం ఒదిగి సాగే పయనం.. ఇలా ప్రత్యేక జీవనశైలి ఆదివాసీల సొంతమన్నారు. తమ సంస్కృతిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. భవిష్యత్తుపై కోటి ఆశలు పెట్టుకుని, మనుగడ సాగిస్తున్న అడవి బిడ్డల జీవితాలపై నేటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని వెల్లడించారు. కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోని గిరి పల్లెలు, సంపూర్ణంగా అందని సంక్షేమ, అభివృద్ధి ఫలాలు, దయనీయంగా కొనసాగుతున్న గిరిజనుల జీవనం,కాలినడకలు.. డోలీ మోతలు.. విద్య, వైద్యం, రోడ్లు, రవాణా అంతంతమాత్రం. ఇది మన రాష్ట్రంలో గిరిజనాభివృద్ధి అంటూ షర్మిల వ్యాఖ్యలు చేశారు.

YSRCP: వైసీపీకి భారీ షాక్.. నాని రాజీనామా


మరోవైపు అంతర్జాతీయ గిరిజన దినోత్సవం గిరిజనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకోష్ అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ... ‘‘జనజీవన ప్రధాన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలనేది తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలలో ఒకటి.. అందుకే నాటి తెలుగుదేశం హాయంలో వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాల పెంపు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశాం. గిరిజనుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించామని, అరకు కాఫీకి, గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపుకోసం ప్రోత్సాహాన్ని అందించాం. గిరిజన జాతులను కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని సమున్నతంగా నిలబెట్టడమేనని.. రాబోయే రోజుల్లో కూడా గిరిజన వర్గాలకు అన్ని విధాలుగా ఆసరాగా నిలబడతామని, గిరిజనులకు, వారి బిడ్డలకు మంచి భవిష్యత్‌ను అందిస్తామని తెలియజేస్తున్నాము’’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.


ఎంత కష్టమైనా.. చెదరని ఆత్మవిశ్వాసం వారి సొంతం: లోకేష్

స్వచ్ఛమైన మనసులు... ప్రకృతిని ప్రేమించే మనుషులు. సమాజానికి ప్రకృతి సంపద పంచడమే తప్ప తిరిగి ఏమీ ఆశించని ఆదివాసీలు వ్యక్తిత్వం నిత్యస్ఫూర్తి అని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సోదరసోదరీమణులకు తన శుభాకాంక్షలు అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ‘‘వారు అడవితల్లి బిడ్డలు. అటవీ ఉత్పత్తులే ప్రధాన జీవనాధారం. ఎంత కష్టమైనా.. చెదరని ఆత్మవిశ్వాసం వారి సొంతం. కాగా.. తరాలు మారుతున్నా.. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా.. వారి తలరాతలు మాత్రం మారడం లేదు. కనీస రహదారులు లేక.. సక్రమంగా వైద్యసేవలు అందకే... ఇప్పటికీ ఎన్నో గిరిజన గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జిల్లాకు ఐటీడీఏ సైతం దూరమైన దుస్థితి నెలకొంది. సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లడంతో అభివృద్ధి కనుమరుగైంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వమైనా.. తమ అభివృద్ధిపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని గిరిజనం వేడుకుంటోంది’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

AP HighCourt: సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్‌కు హైకోర్టులో చుక్కెదురు..


అచ్చెన్న శుభాకాంక్షలు...

ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. గిడుగు రామ్మూర్తి పంతులు స్ఫూర్తితో ఆదివాసీల సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. ఆదివాసీల సంస్కృతికి నిదర్శనమైన ‘ఆదివాసీల భాష’ను సంరక్షించి సవర భాషకు లిపిని నిక్షిప్తం చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి స్ఫూర్తితో ఆదివాసీల సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తామని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిపుత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి..

Sandhyarani: గిరిజనుల అభివృద్ధి కోసమే ఎన్టీఆర్ ఐటీడీఏను స్థాపించారు..

YS Jagan: ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోంది: వైఎస్ జగన్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 09 , 2024 | 02:55 PM