Share News

Delhi : రాహుల్‌ పౌరసత్వం రద్దుకు ఢిల్లీ హైకోర్టులో పిల్‌

ABN , Publish Date - Aug 18 , 2024 | 03:47 AM

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంఽధీ పౌరసత్వాన్ని రద్దు చేసేలా కేంద్ర హోం శాఖను ఆదేశించాలని కోరుతూ బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు

Delhi : రాహుల్‌ పౌరసత్వం రద్దుకు ఢిల్లీ హైకోర్టులో పిల్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 17: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంఽధీ పౌరసత్వాన్ని రద్దు చేసేలా కేంద్ర హోం శాఖను ఆదేశించాలని కోరుతూ బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఆ పిల్‌ ప్రకారం.. రాహుల్‌ గాంధీ 2003లో యూకేకు చెందిన బ్యాక్‌ఆప్స్‌ లిమిటెడ్‌ అనే కంపెనీకి డైరెక్టర్‌, కార్యదర్శిగా వ్యవహరించారు. 2005 అక్టోబరు 10, 2006 అక్టోబరు 31న సమర్పించిన రిటర్నుల్లో రాహుల్‌ జాతీయతను బ్రిటి్‌షగా పేర్కొన్నారు. కంపెనీని రద్దు చేస్తూ 2009 ఫిబ్రవరి 17న సమర్పించిన దరఖాస్తులోనూ రాహుల్‌ జాతీయతను బ్రిటి్‌షగానే నమోదు చేశారు. ఇది రాజ్యాంగంలోని 9వ అధికరణం, భారత పౌరసత్వ చట్టం-1955కు వ్యతిరేకమని సుబ్రహ్మణ్య స్వామి ‘పిల్‌’లో ఆరోపించారు. 9వ అధికరణం ప్రకారం ఎవరైనా విదేశీ పౌరసత్వాన్ని తీసుకుంటే వారు భారత పౌరసత్వాన్ని కోల్పోతారు.

Updated Date - Aug 18 , 2024 | 03:47 AM