Share News

Crime News: వీడు మనిషేనా.. దూరంగా ఉండాలన్న పాపానికి గొంతు కోశాడు

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:47 PM

తన స్నేహితురాలికి దూరంగా ఉండాలన్న పాపానికి ఓ అమ్మాయిని దారుణంగా హత్య చేశాడో నీచుడు. అర్ధరాత్రి పీజీ హాస్టల్‌లోకి చొరబడి బతిమిలాడిన వినకుండా యువతి మెడపై కత్తితో విచ్చలవిడిగా దాడి చేశాడు.

Crime News: వీడు మనిషేనా.. దూరంగా ఉండాలన్న పాపానికి గొంతు కోశాడు

బెంగళూరు: తన స్నేహితురాలికి దూరంగా ఉండాలన్న పాపానికి ఓ అమ్మాయిని దారుణంగా హత్య చేశాడో నీచుడు. అర్ధరాత్రి పీజీ హాస్టల్‌లోకి చొరబడి బతిమిలాడిన వినకుండా యువతి మెడపై కత్తితో విచ్చలవిడిగా దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోగా.. పోలీసులకు దొరికాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగుళూరులోని మహిళా పీజీ వసతిగృహంలో మంగ‌ళ‌వారం బిహార్‌కి చెందిన కృతి కుమారీ(24) హత్యకు గురైంది. కోర‌మంగ‌ల వెంక‌ట‌రెడ్డి లే అవుట్‌లో ఉన్న భార్గవి స్టేయింగ్ హోమ్స్‌లో ఈ హ‌త్య జ‌రిగింది.


అసలేమైందంటే..

కృతి కుమారితోపాటు ఆమె హాస్టల్ గదిలో మరో అమ్మాయి ఉంటోంది. అయితే ఆమె స్నేహితుడు అభిషేక్.. కృతి రూమ్‌మేట్‌తో తరచూ గొడవపడేవాడు. ఇద్దరి మధ్య గొడవ పెరిగినప్పుడల్లా.. ఇరువురికి కృతి సర్దిచెప్పేది. ఇటీవల వారిరువురు మరోసారి గొడవపడ్డారు. దీంతో అభిషేక్‌కి దూరంగా ఉండాలని తన రూమ్‌మేట్‌కు కృతి సలహా ఇచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న అభిషేక్ కోపం పెంచుకుని.. కృతిని హత్య చేయాలని పతకం పన్నాడు. అర్ధరాత్రి 11 గంటలకు హాస్టల్‌లోకి అక్రమంగా చొరబడి కృతి ఉంటున్న గది వద్దకు వెళ్లాడు.


కృతి తలుపు తెరవగానే.. అభిషేక్ కత్తితో దాడికి దిగాడు. చాలా సార్లు ఆమె మెడపై కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో కృతి అక్కడికక్కడే కుప్పకూలింది. రక్తపుమడుగుల్లో పడి ఉన్న కృతిని గమనించిన హాస్టల్ సిబ్బంది విషయాన్ని పోలీసులకు తెలిపారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని మధ్యప్రదేశ్ రాజ‌ధాని భోపాల్‌లో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు . హాస్టల్ కారిడార్‌లో హత్యకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఈ కేసును మరికొన్ని కోణాల్లో దర్యాప్తు చేయనున్నట్లు పోలీస్ కమీషనర్ దయానంద్ తెలిపారు. ఈ ఘటన బెంగళూరు నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

For Latest News and National News click here

Updated Date - Jul 27 , 2024 | 12:47 PM