Share News

MP Balashauri : బందరులో పట్టాభి కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించాలి

ABN , Publish Date - Jul 30 , 2024 | 04:43 AM

మచిలీపట్నంలో పట్టాభి సీతారామయ్య కన్వెన్షన్‌ సెంటర్‌, మ్యూజియం పనులన త్వరగా ప్రారంభించాలని జనేసన లోక్‌ సభాపక్ష నేత బాలశౌరి కోరారు.

MP Balashauri :  బందరులో పట్టాభి కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించాలి

  • పార్లమెంటులో జనసేన లోక్‌సభాపక్ష నేత బాలశౌరి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూలై 29(ఆంధ్రజ్యోతి): మచిలీపట్నంలో పట్టాభి సీతారామయ్య కన్వెన్షన్‌ సెంటర్‌, మ్యూజియం పనులన త్వరగా ప్రారంభించాలని జనేసన లోక్‌ సభాపక్ష నేత బాలశౌరి కోరారు. సోమవారం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ తెలుగువారి గొప్పతనాన్ని చాటి చెప్పేలా భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రాబ్యాంక్‌ను ప్రారంభించారని తెలిపారు. అలాగే కిసాన్‌ సమ్మాన్‌ క్రె డిట్‌ రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచాలని, కడపలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jul 30 , 2024 | 01:13 PM