Share News

Ponnam Prabhakar : నైపుణ్యాభివృద్ధి కేంద్రాలలో ప్రాధాన్యం!

ABN , Publish Date - Jun 20 , 2024 | 02:16 AM

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ బుధవారం కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు.

Ponnam Prabhakar : నైపుణ్యాభివృద్ధి కేంద్రాలలో ప్రాధాన్యం!

రాష్ట్రానికి ఇవ్వాలని కిషన్‌రెడ్డికి పొన్నం విజ్ఞప్తి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పొన్నం భేటీ

న్యూఢిల్లీ, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ బుధవారం కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. కిషన్‌రెడ్డి నివాసంలో భేటీ అయిన ఆయన రాష్ట్రాభివృద్ధికి సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం, కేంద్ర నైపుణ్యాభివృద్దిశాఖ కార్యాలయంలో మంత్రి జయంత్‌ చౌధరిని మర్యాదపూర్వకంగా కలిసి దేశంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాలలో తెలంగాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jun 20 , 2024 | 02:16 AM