Share News

Heat Waves: ఉత్తరాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్..

ABN , Publish Date - Jun 17 , 2024 | 05:39 PM

ఉత్తర భారతదేశంలో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో వేడి గాలుల(హీట్ వేవ్స్)కు ప్రజలు అల్లాడిపోతున్నారు.

Heat Waves: ఉత్తరాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్..

ఢిల్లీ: ఉత్తర భారతదేశంలో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో వేడి గాలుల(హీట్ వేవ్స్)కు ప్రజలు అల్లాడిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఢిల్లీలో ఎండ తీవ్రత బాగా పెరగడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆయా రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్(Red Alert) జారీ చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45డిగ్రీలు దాటిపోయాయి. ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. హీట్ వేవ్స్‌తో ప్రజలు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు.

Updated Date - Jun 17 , 2024 | 05:48 PM