Share News

‘వందేభారత్‌’కు మంచిర్యాలలో హాల్టింగ్‌ ఇవ్వాలి

ABN , Publish Date - Sep 16 , 2024 | 11:00 PM

సికింద్రాబాద్‌ నుంచి నాగపూర్‌ నడిచే వందేభారత్‌ రైలును మంచిర్యాలలో హాల్టింగ్‌ ఇవ్వాలని రైల్వే స్టేషన్‌లో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నాయకులు ఆందోళన చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ వారికి మద్దతు తెలిపారు. చాంబర్‌ ఆఫ్‌ కామ ర్స్‌ అధ్యక్షుడు గుండా సుధాకర్‌, ఇరుకుళ్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ మం చిర్యాల రైల్వే స్టేషన్‌ ఏ గ్రేడ్‌ అయినప్పటికి ఇక్కడ ప్రధాన రైళ్లు నిలపక పోవడంతో వ్యాపారస్తులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

‘వందేభారత్‌’కు మంచిర్యాలలో హాల్టింగ్‌ ఇవ్వాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 16: సికింద్రాబాద్‌ నుంచి నాగపూర్‌ నడిచే వందేభారత్‌ రైలును మంచిర్యాలలో హాల్టింగ్‌ ఇవ్వాలని రైల్వే స్టేషన్‌లో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నాయకులు ఆందోళన చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ వారికి మద్దతు తెలిపారు. చాంబర్‌ ఆఫ్‌ కామ ర్స్‌ అధ్యక్షుడు గుండా సుధాకర్‌, ఇరుకుళ్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ మం చిర్యాల రైల్వే స్టేషన్‌ ఏ గ్రేడ్‌ అయినప్పటికి ఇక్కడ ప్రధాన రైళ్లు నిలపక పోవడంతో వ్యాపారస్తులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వందేభారత్‌ రైలు మంచిర్యాలలో నిలిపితే ఈ ప్రాంత వాసులకు ఉపయో గకరంగా ఉంటుందన్నారు. స్థానిక రైల్వే అధికారులకు వినతిపత్రం అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షడు వెర్రబెల్లి రఘునాథ్‌ మాట్లాడుతూ త్వరలో రైల్వే మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెల్లి హాల్టింగ్‌ కోసం కృషి చేస్తానన్నారు. పెద్దపల్లి ఎంపీ సైతం పార్లమెంటులో ఈ అంశాన్ని లేవ నెత్తి హాల్టింగ్‌ కోసం కృషి చేయాలని కోరారు. నాయకులు ఇరుకుళ్ల శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌ శెట్టి, జనార్దన్‌, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 11:00 PM