Share News

Congress: బోనాల చెక్కుల పంపిణీలో రాజకీయాలు వద్దు..

ABN , Publish Date - Jul 17 , 2024 | 12:11 PM

ఆర్కేపురం బోనాల చెక్కుల పంపిణీ వ్యవహారంలో ఎమ్మెల్యే సబితారెడ్డి(MLA Sabita Reddy) రాద్ధాంతం చేస్తున్నారని జల్‌పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ షేక్‌ జహంగీర్‌, లాల్‌ సతీష్‌ గౌడ్‌, ఆదిల్ల జంగయ్యలు అన్నారు,

Congress: బోనాల చెక్కుల పంపిణీలో రాజకీయాలు వద్దు..

హైదరాబాద్: ఆర్కేపురం బోనాల చెక్కుల పంపిణీ వ్యవహారంలో ఎమ్మెల్యే సబితారెడ్డి(MLA Sabita Reddy) రాద్ధాంతం చేస్తున్నారని జల్‌పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ షేక్‌ జహంగీర్‌, లాల్‌ సతీష్‌ గౌడ్‌, ఆదిల్ల జంగయ్యలు అన్నారు, మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి ప్రోటోకాల్‌ ప్రకారం గౌరవించి చెక్కుల పంపిణీకి ఆహ్వానించినా కొంతమంది బీఆర్‌ఎస్‌(BRS) నేతలు రాజకీయాలు చేస్తున్నారనన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: 8 ఏళ్లుగా నగరంలోనే నైజీరియన్‌ స్మగ్లర్‌


మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మ రెడ్డి కార్యక్రమంలో పాల్గొనడంతో గొడవ చేసి నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. కిచ్చన్న గారి లక్ష్మారెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మహేశ్వరం ఇన్‌చార్జిగా ప్రకటించారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన ఉంటారన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. రాజకీయ లబ్ధికోసం ఇలాంటి రాజకీయాలు చేయకుండా నియోజకవర్గం అభివృద్థికి కృషి చేస్తే బాగుంటుందన్నారు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 17 , 2024 | 12:11 PM