Share News

Ganesh shobha Yatra: గణేష్ శోభాయాత్రలో చార్మినార్ వద్ద బురఖాతో యువతి కలకలం

ABN , Publish Date - Sep 17 , 2024 | 07:38 PM

చార్మినార్ వద్ద బురఖా ధరించి తిరుగుతున్న యువతి కలకలం సృష్టించింది. బురఖా ధరించి ప్రియుడితో కలిసి చార్మినార్ వద్ద యువతి స్థానికులకు కనిపించింది. యువతిని గుర్తించి స్థానిక ముస్లిం యువకులు పట్టుకున్నారు.

Ganesh shobha Yatra: గణేష్ శోభాయాత్రలో చార్మినార్ వద్ద బురఖాతో యువతి కలకలం

హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. నిమజ్జనానికి తరలి వెళ్లే వినాయక వాహనాల శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ట్రాఫిక్ జామ్ నెలకొంది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం జరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది.


ALSO READ:Bhatti Vikramarka: చరిత్రలో 1948, సెప్టెంబర్ 17 గురించి డిప్యూటీ సీఎం ఏం చెప్పారంటే...

హుస్సేన్ సాగర్ వరకు గణనాథుల శోభాయాత్ర సాగనుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో నిమజ్జనానికి ఆలస్యం అవుతోంది. చార్మినార్ వద్ద బురఖా ధరించిన యువతి కలకలం సృష్టించింది. బురఖా ధరించి ప్రియుడితో కలిసి చార్మినార్ వద్ద యువతి స్థానికులకు కనిపించింది. యువతిని గుర్తించి స్థానిక ముస్లిం యువకులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.


ALSO READ:Dana Nagender: తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే హైడ్రా..

ఆ యువతిని పోలీసులు విచారించారు. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో బురఖా ధరించిన యువతి, ఆమెతో పాటు ఉన్న వ్యక్తి ఇద్దరు కూడా వరంగల్‌కు చెందిన వారిగా గుర్తించారు. చార్మినార్ వద్ద నిమజ్జనానికి వెళ్లే వినాయకులను చూడటానికి ప్రేమ జంట వచ్చింది. స్థానికంగా ఉన్న తమ బంధువులు చూస్తారనే భయంతో బురఖా ధరించానని యువతి పోలీసులకు వివరించింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ప్రేమ జంట ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి...

KTR: వాళ్ల మెప్పు కోసమే రాజీవ్ విగ్రహ స్థాపన

Harish Rao: రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న సీఎం రేవంత్.. హరీష్‌రావు విసుర్లు

KTR: వాళ్ల మెప్పు కోసమే రాజీవ్ విగ్రహ స్థాపన

Atishi: అతిషి పోలిటికల్ ఎంట్రీ ఎలా జరిగిందంటే..?

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 17 , 2024 | 09:16 PM