Share News

TG Govt: పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం

ABN , Publish Date - Jul 10 , 2024 | 08:11 PM

పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు( బుధవారం) ఘనంగా సన్మానించారు.

TG Govt: పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం
CM Revanth Reddy

హైదరాబాద్: పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు( బుధవారం) ఘనంగా సన్మానించారు. అనంతరం ఒక్కొక్కరికి రూ.25లక్షల చొప్పున చెక్కులను ముఖ్యమంత్రి అందజేశారు.

చెక్కులు అందుకున్న వారిలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య , దాసరి కొండప్ప, వేలు ఆనందచారి, కూరేళ్ల విఠలాచార్య, కేతావత్ సోంలాల్ ఉన్నారు. చెక్కులను అందించిన సందర్బంగా ముఖ్యమంత్రికి పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2024 | 08:12 PM