Share News

Hyderabad: ఎంత నిర్దయరాలివి తల్లీ! నీ బిడ్డ కాదని ఇంత ఘోరం చేస్తావా?

ABN , Publish Date - May 12 , 2024 | 10:38 AM

ఆ తల్లిది గుండెనా? పాషాణమా? అభం శుభం తెలియని 14 ఏళ్ల కూతుర్ని వ్యభిచారంలోకి దించింది. ‘ఆ పాడుపని’ నేను చేయలేనమ్మా అని వేడుకున్నా చిత్రహింసలు పెట్టింది. జట్టు కత్తిరించి.. కర్రతో ఇష్టంవచ్చినట్లు కొట్టింది. ఏడుస్తున్నా కనికరించకుండా బాలికతో వ్యభిచారం చేయించింది. ఇలా ఆ రాకాసి చెరలో చిన్నారి ఏకంగా రెండేళ్లు నరకం చూసింది. జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటూ..

Hyderabad: ఎంత నిర్దయరాలివి తల్లీ! నీ బిడ్డ కాదని ఇంత ఘోరం చేస్తావా?
Hyderabad

హైదరాబాద్‌, మే 12: ఆ తల్లిది గుండెనా? పాషాణమా? అభం శుభం తెలియని 14 ఏళ్ల కూతుర్ని వ్యభిచారంలోకి దించింది. ‘ఆ పాడుపని’ నేను చేయలేనమ్మా అని వేడుకున్నా చిత్రహింసలు పెట్టింది. జట్టు కత్తిరించి.. కర్రతో ఇష్టంవచ్చినట్లు కొట్టింది. ఏడుస్తున్నా కనికరించకుండా బాలికతో వ్యభిచారం చేయించింది. ఇలా ఆ రాకాసి చెరలో చిన్నారి ఏకంగా రెండేళ్లు నరకం చూసింది. జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటూ.. సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తున్న ఓ మహిళ పాల్పడిన దారుణమిది. ఒంటినిండా గాయాలతో ఇంట్లో బందీగా ఉన్న బాలికను చూసి పోలీసులు చలించిపోయారు. కన్నతల్లి అయివుండి తన పట్ల ఎందుకింత నిర్దయగా వ్యవహరిస్తోందనే విషయం అర్థంకాని ఆ బాధిత బాలికకు తాజాగా ఆమె తన తల్లే కాదనే విషయం తెలిసింది.


జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న 38 ఏళ్ల జూనియర్‌ ఆర్టిస్టు దాదాపు 15 ఏళ్లుగా ఇంట్లోనే వ్యభిచారం నిర్వహిస్తోంది. విటుల డిమాండ్‌ మేరకు తన స్నేహితురాళ్లనూ ఇంటికి పిలిపించుకునేది. 13 ఏళ్ల క్రితం స్నేహితురాళ్లలో ఒకరు తన ఏడాది బిడ్డను ఆమెకు అప్పగించి నగరం విడిచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బాలికను ఆమె పెంచుకుంటోంది. బడికీ పంపుతోంది. పెంపుడు కూతురు అనే సంగతి బాలికకు చెప్పకపోవడంతో ఆమే తన తల్లి అని చిన్నారి భావిస్తూవస్తోంది. ఆమె ఇంటికి వచ్చే విటుల్లో కొందరు బాలికపై కన్నేసి, ఎక్కువ డబ్బులిస్తామని మహిళకు ఆఫర్‌ చేశారు. దీంతో బాలికనూ పాడుపనిలోకి దించాలని భావించి, రెండేళ్ల క్రితమే బడి మాన్పించింది.


అప్పటి నుంచి చిన్నారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తోంది. ఇంట్లోంచి బాలిక కేకలను విని స్థానికులు, పోలీసులకు సమాచారమిచ్చారు. వెస్ట్‌ జోన్‌ ఇన్‌స్పెక్టర్‌ జంగయ్య తన బృందంతో ఆ మహిళ ఇంటిపై దాడిచేశారు. బాలిక చేతులు, కాళ్లపై అట్లకాడతో కాల్చిన గాయాలతో పాటు మెడ, పెదవిపైనా గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే బాధిత బాలికను వైద్య పరీక్షలు, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. తనతో పాటు వ్యభిచారంలోకి దిగిన మహిళే తనకు 13 ఏళ్ల క్రితం చిన్నారిని అప్పగించి నగరం విడిచి వెళ్లిపోయిందని ఒకసారి.. బాలికను అప్పగించి చనిపోయిందని మరోసారి నిందితురాలు చెబుతోంది.

For More Telangana News and Telugu News..

Updated Date - May 12 , 2024 | 10:38 AM