Share News

MLA Mahipal Reddy: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..

ABN , Publish Date - Jul 13 , 2024 | 09:15 PM

బీఆర్ఎస్‌కు మరో భారీ షాక్ తగిలింది. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారు. కానీ స్థానిక నేతల అభ్యంతరంతో ఆగిపోయారు. ఇవాళ(శనివారం) మధ్యాహ్నం దానం నాగేందర్‌తో ఎమ్మెల్యే భేటీ అవ్వగా.. స్థానిక నేతలకు దానం నచ్చజెప్పారు. దీంతో కాంగ్రెస్‪లో చేరేందుకు దారి క్లియర్ అయ్యింది.

MLA Mahipal Reddy: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..
MLA Gudem Mahipal Reddy

హైదరాబాద్: బీఆర్ఎస్‌కు మరో భారీ షాక్ తగిలింది. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారు. కానీ స్థానిక నేతల అభ్యంతరంతో ఆగిపోయారు. ఇవాళ(శనివారం) మధ్యాహ్నం దానం నాగేందర్‌తో ఎమ్మెల్యే భేటీ అవ్వగా.. స్థానిక నేతలకు దానం నచ్చజెప్పారు. దీంతో కాంగ్రెస్‪లో చేరేందుకు దారి క్లియర్ అయ్యింది.


మహిపాల్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది. శుక్రవారం సాయంత్రం రాజేంద్రనగర్​ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్ హస్తం గూటికి చేరగా.. ఇవాళ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. రెండ్రోజుల వ్యవధిలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరడంతో బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లు అయ్యింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

ఇది కూడా చదవండి:

Road Accident: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..

Updated Date - Jul 13 , 2024 | 09:20 PM