Share News

Hyderabad: నడిరాత్రంతా రోడ్ల మీద తిప్పి..

ABN , Publish Date - Jul 15 , 2024 | 04:33 AM

భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఇంటికి బయలుదేరిన మహిళ (29) సామూహిక అత్యాచారానికి గురైంది. అల్వాల్‌ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శుక్రవారం సాయంత్రం యాప్రాల్‌లో ఓ మహిళ ఉబెర్‌ ఆటో (వాహనం నంబరు ఏపీ 11టీఏ 0266) బుక్‌ చేసింది.

Hyderabad: నడిరాత్రంతా రోడ్ల మీద తిప్పి..

  • వివాహితపై సామూహిక అత్యాచారం

  • భర్తపై పోలీస్‌ స్టేషన్‌లో

  • ఫిర్యాదు చేసి వెళ్తుంటే దారుణం

  • అల్వాల్‌లో ఘటన

  • నడి రాత్రంతా రోడ్ల మీద తిప్పి..

  • వివాహితపై ఇద్దరి అత్యాచారం

హైదరాబాద్‌ సిటీ/అడ్డగుట్ట, జూలై 14 (ఆంధ్రజ్యోతి): భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఇంటికి బయలుదేరిన మహిళ (29) సామూహిక అత్యాచారానికి గురైంది. అల్వాల్‌ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శుక్రవారం సాయంత్రం యాప్రాల్‌లో ఓ మహిళ ఉబెర్‌ ఆటో (వాహనం నంబరు ఏపీ 11టీఏ 0266) బుక్‌ చేసింది. అందులో డ్రైవర్‌ పేరు ఎస్‌ శంకర్‌ అని ఉంది. ఆ ఆటో రాగానే ఎక్కి ఆల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ పని ముగించుకొని, మళ్లీ అదే ఆటోలో ఇంటికి తిరుగు ముఖం పట్టింది. అప్పటికే ఆమెపై కన్నేసిన డ్రైవర్‌, ఆమెను మాటల్లో పెట్టి, వీధుల గుండా తిప్పుతూ ఓ మద్యం షాపు వద్ద ఆటోను ఆపాడు.


మహిళ అభ్యంతరం చెబుతున్నా, అక్కడ ఇద్దరు వ్యక్తులను ఆటో ఎక్కించుకున్నాడు. ఆ ఇద్దరు, మద్యం తాగుతూ మహిళ వద్దువద్దంటున్నా ఆమెతోనూ బలవంతంగా మద్యం తాగించారు. వాహనాన్ని అల్వాల్‌లోని వెంకట్రావు లేన్‌లో ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను బెదిరింపులకు గురిచేసి ఓ కారు ఎక్కించారు. తర్వాత ఆటో డ్రైవర్‌ అక్కడి నుంచి తన వాహనంతో వెళ్లిపోగా, కారులోనే ఇద్దరూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున 2:45కు ఆ ఇద్దరి నుంచి తప్పించుకొని బాధితురాలు రోడ్డు మీదకొచ్చి కాపాడడంటూ కేకలు వేసింది.


ఓ గూడ్స్‌ క్యారియర్‌ ఆటో డ్రైవర్‌ సాయంతో ఆ వాహనంలోనే సమీపంలోని గణేశ్‌ ఆలయం వద్దకు చేరుకుంది. అక్కడ స్థానికుల సాయంతో డయల్‌ 100కు కాల్‌ చేసి ఘటనపై ఫిర్యాదు చేసింది. బొల్లారం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఘటనపై శుక్రవారం జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు, కేసును అల్వాల్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆటో డ్రైవర్‌ శంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 10:20 AM