Home » Konda Surekha
Telangana: రైతు భరోసాపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు. రైతు భరోసా పథకం కోసం ప్రతీఒక్క రైతు ఎదురుచూస్తున్న నేపథ్యంలో మంత్రి ఇచ్చిన ప్రకటన ఊరటనిస్తుందనే చెప్పొచ్చు.
దేశ రక్షణకు సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడుతూ సైనికులు ప్రాణాలు అర్పిస్తుంటే, సహజవనరులైన అడవుల సంరక్షణ కోసం అటవీశాఖ ఉద్యోగులు ప్రాణాలు అర్పిస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినం సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నోటికొచ్చినట్టు దుర్భాషలాడి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలంటూ ‘ఎక్స్’ వేదికగా విచారం వ్యక్తం చేసినంత మాత్రాన సరిపోదని, కేటీఆర్ అహంకారపు మాటలను తెలంగాణ మహిళా సమాజం మర్చిపోదని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో తోపులాట ఘటనపై మంత్రి కొండా సురేఖ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని ఆమె అన్నారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ దర్యాప్తు చేస్తోందని ఆమె అన్నారు.
బల్కంపేట ఎల్లమ్మతల్లి(Balkampet Yellamma) కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కల్యాణాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచీ పెద్దఎత్తున భక్తులు, ప్రముఖులు తరలివస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వామీఅమ్మవార్లను అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ(Minister konda surekha) దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆలయానికి చేరుకున్నారు.
ఎదుటి వ్యక్తితో పని చేయించుకోవడంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఒక ప్రత్యేకత ఉండేదని ఆయన సన్నిహిత మిత్రుడు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు.
భాగ్యనగరంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నెలరోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేదమంత్రాలు, ఊరేగింపులు, శివసత్తులు, పోతరాజుల నృత్యాలతో ఆదివారం చారిత్రక గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలకు శ్రీకారం చుట్టారు.
హైదరాబాద్లో ఇక బోనాల సందడి! ఆషాఢమాసం తొలి ఆదివారమైన నేటి నుంచి ఆగస్టు 4వ తేదీ దాకా నెలరోజుల పాటు ప్రధాన ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగతాయి.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించిన నాటి నుంచి ఈ ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న దశాబ్ది ఆషాఢ మాస బోనాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రతిపాదించిన పనులను వివిధ శాఖల సమన్వయంతో జూలై 5లోగా పూర్తిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.